close
Choose your channels

ఆనంద్ మహీంద్రా ట్వీట్.. షాకవుతున్న నెటిజన్లు..

Wednesday, November 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. కొంతకాలంపాటు జనాలు కంప్లీట్‌గా ఇళ్లకే పరిమితమయ్యారు. తిరిగి ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో బయటకు వచ్చి తమ పనులు చూసుకుంటున్నారు. దాదాపు 8 నెలల పాటు ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజానీకానికి ఓ చిన్న ఆశ కల్పిస్తూ భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌ వేదికగా ఓ ఆసక్తి పోస్టు పెట్టారు. ఈ పోస్టు నెటిజన్లలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే పోస్ట్ చివరకు వచ్చి చూసే వరకూ షాక్ అవుతున్నారు.

ఆనంద్ మహీంద్రా.. నిన్న(మంగళవారం) ఒక పోస్టు పెట్టారు. మీరు విహారయాత్రకు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో చెప్పండంటూ పలు దేశాల పేర్లను వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. తర్వాత మీ ట్రావెల్ డెస్టినేషన్‌ను ఎంచుకోండంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. 15 దేశాల పేర్లను ఇచ్చి వాటిని ఎంచుకునేందుకు ఒక పజిల్ ఇచ్చారు. ఆ పజిల్‌ ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో అసలు విహార యాత్రకు వెళ్లాలనుకున్న వారితో పాటు అనుకోని వారు సైతం పూర్తి చేసి నోరెళ్లబెట్టారు.

15 దేశాల పేర్లను పేర్కొన్న ఆనంద్ మహీంద్రా.. పజిల్‌లో ఇచ్చిన దానికి ప్రకారం చేసుకుంటూ వెళ్లిన వారికి ఎలా చేసినప్పటికీ ఫైనల్ సమాధానం మాత్రం 9 వస్తుంది. తీరా 9లో ఉన్న విహార యాత్రా ప్రదేశాన్ని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా 9వ నంబర్‌లో ‘ఇంట్లోనే ఉండండి’ అని పెట్టారు. కరో్నా మహమ్మారి సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన క్రమంలో ఎటూ వెళ్లవద్దు ఇంటి పట్టునే ఉండండని చెప్పేందుకు ఆనంద్ మహీంద్రా ఈ దారిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.