నితిన్ రీమేక్‌లో అన‌సూయ‌?

  • IndiaGlitz, [Monday,February 24 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన 'భీష్మ'తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి రీమేక్ సినిమా. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు న‌టించిన 'అంధాదున్' సినిమా పెద్ద హిట్టైన సంగ‌తి తెలిసిందే. దాని రీమేక్ హ‌క్కుల‌ను నితిన్ ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే సినిమా లాంఛనంగా సోమ‌వారం ప్రారంభ‌మ‌వుతుంది. రెగ్యుల‌ర్ షూటింగ్‌కు కాస్త గ్యాప్ తీసుకుంటారు. కాగా.. ఈ సినిమాలో రాధికా ఆప్టే స్థానంలో ఎవ‌రు న‌టిస్తారు? ట‌బు స్థానంలో ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు టటు స్థానంలో అన‌సూయ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో క్ష‌ణం, రంగ‌స్థ‌లం సినిమాల‌తో న‌టిగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్న అన‌సూయ‌.. ఇప్పుడు మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌ట‌. ఈ సినిమాలో అన‌సూయ పాత్ర‌కు చాలా గుర్తింపు ఉంటుంది. అలాగే నితిన్ అంధుడిగా న‌టించ‌బోతున్నాడు. నితిన్ త‌న సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌పై ఈ సినిమాను నిర్మించ‌బోతున్నాడు. మ‌రి హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకుంటార‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

దర్శకులు అందరికీ 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' అంకితం! - బాలు అడుసుమిల్లి

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా

రాజమౌళికి షాకిచ్చిన గూగుల్

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అంటే ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో తెలియ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.

ట్రంప్‌కు ఘన స్వాగతం.. హగ్ ఇచ్చిన మోదీ.. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్‌లో అడుగుపెట్టారు. భారత్‌కు ట్రంప్‌ రావడం ఇదే తొలిసారి. ప్లైట్ దిగగానే ఆయనకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలుకుతున్నారు.

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, అనుష్క శెట్టి ముఖ్య అతిథులుగా .. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ `హిట్` మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా

రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ ఖ‌రారైందా?

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఈ వేస‌వికి చిత్రీక‌ర‌ణ ముగుస్తుంది.