close
Choose your channels

భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా అనసూయ నో చెప్పిందట

Tuesday, May 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా అనసూయ నో చెప్పిందట

తెలుగులో బిగ్‌బాస్ 1,2,3 షోలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌కు జూనియర్ ఎన్టీఆర్.. టూకు నేచురల్ స్టార్ నానీ.. త్రీకు యువసామ్రాట్, మన్మథుడు నాగార్జున హోస్ట్‌‌గా వ్యవహరించిన విషయం విధితమే. సెకండ్ సీజన్ మొదట పెద్దగా హిట్టవ్వకపోయినప్పటికీ రానురాను డోస్ పెంచిన నానీ సూపర్ డూపర్ హిట్ చేసేశారు. ఆ తర్వాత మొదలైన త్రీ ఊహించని రీతిలో మునుపెన్నడూ లేని టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అయితే నాల్గో సీజన్‌కు దగ్గరపడుతుండటంతో కంటెస్టెంట్స్ ఎవరు..? యాంకర్ ఎవరు..? అనేదానిపై ప్రస్తుతం యాజమాన్యం తలమునకలైంది.

భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా అనసూయ నో చెప్పిందట

ఇదీ అసలు సంగతి..

కాగా కంటెస్టెంట్స్‌ను సెలక్ట్ చేసే పనిలో భాగంగా.. బుల్లితెర యాంకర్ కమ్ నటి అనసూయను సంప్రదించారట. అయితే ఆ భామ మాత్రం అస్సలు తనకు ఇంట్రెస్ట్ లేదని.. తేల్చి చెప్పేసిందట. మళ్లీ మళ్లీ అడగటంతో ఆమె పలు కారణాలు కూడా చెప్పిందట. అంతేకాదు భారీగా రెమ్యునరేషన్ ఇస్తామని బంపరాఫర్ ఇచ్చినా అస్సలు కుదరదని చెప్పిందట. వాస్తవానికి ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో ఈ భామ బిజిబిజీగా గడుపుతూనే ఉంది. ఇటు బుల్లి తెరపై అటు వెండితెరపైనా బిజీగానే గడుపుతోంది. అటు వరుస చిత్రాల్లోనూ నటిస్తూ యమా బిజీగా ఉంది. పైగా.. ఫ్యామిలీని వదిలి అన్నెన్ని రోజులు బిగ్ బాస్‌లో ఉండలేనని చెప్పేసిందట. ఈ కారణాలన్నీ తనను సంప్రదించిన ‘మా’ యాజమాన్యానికి నిశితంగా వివరించిందట. అయితే.. ఆఖరికి వైల్డ్ కార్డ్ ద్వారా అయినా ఎంట్రీ ఉంటుందా..? అని అడగ్గా చూద్దాం అప్పటి సంగతి అప్పుడు చూద్దామండి అని చెప్పేసి చేతులు దులిపేసుకుందట. మరి ఇలా అయినా అనసూయ ఎంట్రీ ఇస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.