Rashmi Gautam : నడి సముద్రంలో నీలి రంగు బికినీలో.. రష్మీ అందాల ప్రదర్శన, ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Monday,November 28 2022]

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వుండగా.. ఒకరిద్దరు మాత్రమే స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అందులో ఒకరు రష్మీ గౌతమ్. కెరీర్ తొలి నాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా ఆమెకు అంతగా కలిసిరాలేదు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా చేసే ఛాన్స్ రావడంతో రష్మీ దశ తిరిగిపోయింది. ఈ దెబ్బతో టీవీ షోలు, ఈవెంట్స్, ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వాటి ద్వారా రష్మీ ఇప్పుడు ఫుల్ బిజీ. అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తూ.. తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

మాల్దీవుల్లో రచ్చ చేస్తోన్న రష్మీ :

సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా వుండే రష్మీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులను పంచుకుంటూ వంటారు. అలాగే తన హాట్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ వుంటారు. ఇటీవల మరో యాంకర్ దీపికా పిల్లితో పాటు పలువురు స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ టూర్‌కి వెళ్లింది రష్మీ. ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఆమె పూర్తిగా హద్దులు దాటేసిందా అన్నట్లుగా వున్నాయి. షర్ట్ బటన్స్ విప్పేసి.. లోపలి బ్రా కనిపించేలా అందాల్ని అరబోసింది. అంతేకాదు ప్యాంట్ కూడా లేకుండా కేవలం షర్ట్‌తో మాత్రమే వుంది.

బుల్లి విమానాన్ని చూపెడుతూ... అందాల విందు:

ఈ వేడి చల్లారకముందే తాజాగా మరోసారి బీచ్‌లో, బోటు మీద రచ్చ చేసింది రష్మీ. పడవపై సముద్రంలో విహరిస్తూ స్కై బ్లూ కలర్ బికినీలో అందాలు అరబోస్తూ... మరోవైపు తన ముందు వెళ్తున్న బుల్లి విమానాన్ని చేతితో ఎవరికో చూపిస్తూ మురిసిపోతోంది. ప్రస్తుతం రష్మీ షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. మాల్దీవుల నుంచి ఇంకా హైదరాబాద్‌కు వచ్చారో లేదో తెలియదు కానీ, వచ్చే రెండు మూడు రోజుల్లో రష్మీ నుంచి మరిన్ని హాట్ ఫోటోలు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.

More News

BiggBoss: బతికిపోయిన ఫైమా, రాజ్ ఎలిమినేషన్... విన్నర్ ఎవరో చెప్పేసిన మిస్టర్ కూల్

ఆదివారం వస్తుంటే చాలు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో టెన్షన్ పీక్స్‌లో వుంటుంది. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో..

శ్రీహాన్ - సిరిల మధ్య చిచ్చుపెట్టిన సొహైల్... ఫ్యామిలీ మెంబర్స్‌, మాజీ కంటెస్టెంట్స్ రాకతో జోష్

ఇంటి సభ్యుల కలయికతో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో కొత్త జోష్ వచ్చింది. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

KA Paul - Roja : పందిలా తిని పిచ్చి కుక్కలా అరుస్తుంది : రోజాపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.

'AP04 రామాపురం' ట్రైలర్ విడుదల

అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో

Pavithra Lokesh - Naresh : మమ్మల్ని అల్లరి చేస్తున్నారు.. ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్‌కు పవిత్రా లోకేష్ ఫిర్యాదు

కన్నడ నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.