ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరిన యాంక‌ర్ సుమ‌

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

సుమ క‌న‌కాల అంటే ఎవ‌రా? అని అనుకుంటారేమో కానీ యాంక‌ర్ సుమ అంటే ఎవ‌రికైనా వెంట‌నే గుర్తు వ‌చ్చేస్తుంది ఈమె. ఈ యాంక‌ర‌మ్మ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరారు. ఇంత‌కు ఎన్టీఆర్‌కు సుమ క‌న‌కాల ఎందుకు చాలెంజ్ విసిరారు?... అంటే టీఆర్ఎస్ పార్ల‌మెంట్ మెంబ‌ర్ జోగిన ప‌ల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ చాలెంజ్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. క్ర‌మంగా ఈ చాలెంజ్‌లో అంద‌రూ పాల్గొంటున్నారు.

ఈ గ్రీన్ చాలెంజ్‌లో ప‌లువుకు సినీ ప్ర‌ముఖులు పాల్గొంటున్నారు. పాల్గొన్న ప్ర‌తివారూ మూడు మొక్క‌లు నాటుతున్నారు. ఈ ఉద్య‌మంలో పాల్గొన్న‌స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ యాంక‌ర్ సుమ‌కు చాలెంజ్ విసిరారు. ఈ స‌వాల్‌ను స్వీక‌రించిన సుమ‌.. బేగంపేట‌లోని మ‌యూరి స్టూడియోలో మూడు మొక్క‌ల‌ను నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌కు, తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ సంద‌ర్భంగా ఆమె థ్యాంక్స్ చెప్పారు.

మ‌నుషుల‌కు క‌ష్టాలు ఎదురైన‌ప్పుడు ప్ర‌కృతి మ‌ధ్య గ‌డిపితే వందేళ్లు హాయిగా బ్ర‌తుకుతామ‌ని ఆమె తెలిపారు. ఉద్య‌మంలో భాగంగా ఆమె భావిత‌రాలు సంతోషంగా ఉండాలంటే ప్ర‌తి వ్య‌క్తి మూడు మొక్కులు నాటాలంటూ చెబుతూ ఎన్టీఆర్‌కి చాలెంజ్ విసిరారు. ఆయ‌న‌తో పాటు బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌, టీవీ షోస్‌, సినిమాల ద‌ర్శ‌క నిర్మాత ఓంకార్ ల‌కు చాలెంజ్ విసిరారు.