ఏపీలో రంజాన్‌ పండుగ మార్గదర్శకాల విడుదల

  • IndiaGlitz, [Wednesday,May 12 2021]

విజయవాడ: కరోనా కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్‌ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రేపు(గురువారం) పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను సామూహికంగా నిర్వహించుకునేందుకు వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఏపీలో కర్ఫ్యూ కూడా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకూ ఈ కర్ఫ్యూ జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ మేరకు డిప్యూటీ సీఎం అంజద్ బాషా రంజాన్ పండుగ మార్గదర్శకాలను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాలు, ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధమని ఆయన వెల్లడించారు. ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని వెల్లడించారు. మసీదులో 50 మందికి మించి ప్రార్థనలకు హాజరు కావొద్దని తెలిపారు. ప్రార్థన సమయంలో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారు ప్రార్థనలకు రావొద్దని అంజద్ బాషా తెలిపారు.

More News

లాక్‌డౌన్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో లాక్‌డైన్ విధించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు.. ఇతర కీలక నిర్ణయాలివే..

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో అనివార్య పరిస్థితుల్లో మరోసారి తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌కు మొగ్గు చూపింది.

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

లాక్‌డౌన్ ప్రకటన వచ్చిందో లేదో మందుబాబులు పెద్ద ఎత్తున వైన్ షాపులకు క్యూ కట్టారు. అయితే వీరికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ అంటే ఎలా?: హైకోర్టు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేటి మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమైంది.

రేపటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్

లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది.