ఐదేళ్ల తర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక...

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]
ఐదేళ్ల త‌ర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక ఎవ‌రో కాదు అందాల నాయిక అంజ‌లి. షాపింగ్ మాల్, జ‌ర్నీ, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు,గీతాంజ‌లి, డిక్టేట‌ర్...త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తెలుగులో అప్పుడ‌ప్పుడు న‌టిస్తున్నా త‌మిళ్ లో మాత్రం వ‌రుస‌గా సినిమాలు చేస్తుంది. తాజాగా జ‌ర్నీ చిత్రంలో న‌టించిన హీరో జై తో క‌లిసి ఓ చిత్రం చేస్తుంది. రొమాంటిక్ హ‌ర్ర‌ర్ క‌ధాంశంతో రూపొందే ఈ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా అంజ‌లి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...హీరో జై తో క‌లిసి న‌టిస్తున్న‌ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభ‌మైంది. ఆఫ్ట‌ర్ ఫైవ్ ఇయ‌ర్స్..న్యూ బిగినింగ్స్ అంటూ ట్వీట్ చేసింది.
గ‌తంలో జ‌ర్ని చిత్రం చేస్తున్న టైమ్ లో జై, అంజ‌లి ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ల‌వ్ బ్రేక్ అప్ అయ్యింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే...ఇటీవ‌ల అంజ‌లి పుట్టినరోజుకి జై బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేయ‌డం...దీనికి స్పంద‌నగా ఇది నా బెస్ట్ బ‌ర్త్ డే..ఎప్పుడూ నాతోనే ఉండు జై అంటూ అంజ‌లి ట్వీట్ చేయ‌డంతో వీరు ల‌వ్ లోనే ఉన్నార‌నే విష‌యం తెలిసింది. ఇప్పుడు జైతో క‌లిసి చేస్తున్న సినిమా పై స్పందిస్తూ... ఐదేళ్ల త‌ర్వాత న్యూ బిగినింగ్స్ అని ఈ చిన్న‌ది అన్న‌ది అంటే..ఖ‌చ్చితంగా అంజ‌లి - జై ల‌వ్ లోనే ఉన్నార‌ని తెలుస్తుంది. మ‌రి...వీరి ల‌వ్ ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

More News

A సర్టిఫికేట్ తో 300 దియోటర్స్ లో రష్మి గౌతమ్ సినిమా రేపే విడుదల

'గుంటూరు టాకీస్'లాంటి సూపర్డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదానపాత్రలో నటించిన చిత్రం 'అంతం'.

బన్ని, హరీష్ శంకర్ ఇద్దరికీ ఆమే కావాలట...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బష్టర్ తర్వాత హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

కార్తీ కాష్మోరా ఎంత వరకు వచ్చింది....

కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా.హర్రర్ కధాంశంతో రూపొందుతున్న కాష్మోరా చిత్రాన్ని గోకుల్ తెరకెక్కిస్తున్నారు.

ఆ హీరోయిన్ తో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్న ద‌ర్శ‌కేంద్రుడు..

ఏ హీరోయిన్ అయినా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సినిమాలో న‌టించాలి అనుకుంటుంది. అయితే...దీనికి భిన్నంగా రాఘ‌వేంద్ర‌రావే ఓ హీరోయిన్ తో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

నాగ్ సెట్ లో న్యూ రూల్..

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.