ఆంధ్రప్రదేశ్ కు మరో 2 విమానాశ్రయాలు


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ లో మరో 2 విమానాశ్రయాలకు అనుమతి లభించింది. రెండు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లాలో, ఇంకోటి అమరావతిలో నిర్మించబోతున్నారు. వీటికి సంబంధించి విధివిధానాలు, ఫీజిబిలిటీ కోసం కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది.
ఆన్ లైన్ విధానంలో జరిగే ఈ టెండర్ల దాఖలుకు 21వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈనెల 24న టెక్నికల్ బిడ్స్, 27న ఫైనాన్షియల్ బిడ్స్ తెరుస్తారు. అమరావతి, శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయలకు ఏ ప్రాంతం అనుకూలమో ఈ సంస్థ నిర్ణయిస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో, సముద్రానికి దగ్గరగా నిర్మించాలని అనుకుంటున్నారు. నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది, ఎన్ని దశల్లో చేపట్టాలి లాంటి అంశాల్ని ఈ కన్సల్టెంట్ కంపెనీలు నిర్ణయిస్తాయి. 35 ఏళ్ల అవసరాలకు సరిపడ మాస్టర్ ప్లాన్ తయారుచేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments