నూతన్ నాయుడిపై మరో రెండు కేసులు..

  • IndiaGlitz, [Saturday,September 12 2020]

సినీ నిర్మాత, బిగ్‌ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నూతన్‌ చేసిన ఘన కార్యాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా నూతన్‌ నాయుడుపై మరో రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

నూతన్ ఏపీతో పాటు తెలంగాణలోనూ మోసాలకు పాల్పడినట్టు స్పష్టమైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి బ్యాంకులో డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానంటూ రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. అలాగే.. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాలుగు లక్షలు వసూలు చేసినట్లు కూడా స్పష్టమైంది. అయితే.. నాలుగు లక్షలు చెల్లించిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో నూతన్‌ను బాధితుడు ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన నూతన్ సాగరతీరంలో హోటల్‌కు బాధితుడ్ని పిలిచి దుర్భాషలాడినట్టు తెలియవచ్చింది.

పెందుర్తి శిరోముండనం కేసులో నూతన్ కుటుంబ అరాచకాలను మీడియాలో చూడటంతో తమకు జరిగిన అన్యాయంపై పలువురు బాధితులు తమకు నూతన్ కారణంగా జరిగిన అన్యాయాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో నూతన్‌ నాయుడును సెంట్రల్ జైలు నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు.

More News

డ్రగ్స్ కేసులో రియా సంచలనం.. టాలీవుడ్‌ సహా 3 ఇండస్ట్రీల్లో షేక్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పరోక్షంగా మూడు ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది.

ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..

బిగ్‌బాస్ సీజన్ 4లో ఎలిమినేషన్ టైం రానే వచ్చింది. ఈవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

రియా డ్రగ్స్‌ కేసులో మరో సంచలనం.. రకుల్ సహా మరికొందరి పేర్లు..!

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం పలు అంశాలను తెరపైకి తీసుకొచ్చింది.

కట్టప్పా.. నోయెల్‌ది ఏం గేమప్పా!

ఈ రోజు బిగ్‌బాస్‌లో పల్ప్ ఫ్యాక్టరీ టాస్క్ నేడు కూడా కంటిన్యూ అయింది. ఈ టాస్క్‌లో నోయెల్ చాలా యాక్టివ్‌గా కనిపించాడు.

ఇబ్బందుల్లో ఎ.ఆర్‌.రెహ్మాన్‌

ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్‌.రెహ్మాన్ కొత్త స‌మ‌స్య‌ల్లో ప‌డ్డారు.