సూప‌ర్‌స్టార్‌తో త‌ల‌ప‌డ‌నున్న మ‌రో బాలీవుడ్ స్టార్!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల్లో ఈ మ‌ధ్య ఎక్కువ‌గా మెయిన్ విల‌న్‌గా బాలీవుడ్ స్టార్సే న‌టిస్తూ వ‌స్తున్నారు. ద‌ర్బార్‌లో సునీల్ శెట్టి, పేట్టాలో న‌వాజుద్దీన్ సిద్ధికీ, కాలాలో నానాప‌టేక‌ర్ ఇలా బాలీవుడ్‌లో పేరున్న స్టార్స్ అంద‌రూ ర‌జినీని వెండితెర‌పై ఢీ కొట్టిన‌వారు. ఇప్పుడు మ‌రో స్టార్ హీరో కూడా వీరి లిస్టులో చేర‌బోతున్నాడు. ఆ స్టార్ ఎవ‌రో కాదు, జాకీష్రాఫ్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. జాకీష్రాప్ ద‌క్షిణాదిలో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. తెలుగులో ఇప్ప‌టికే చాలా సినిమాల్లో న‌టించారీయ‌న‌.

అయితే త‌మిళంలో ర‌జినీతో త‌ల‌ప‌డే మెయిన్ విల‌న్ పాత్ర‌లో జాకీష్రాఫ్ న‌టించ‌నుండ‌టం ఇదే తొలిసారి కానుంది. శివ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘అణ్ణాత్తే’. ఖుష్బూ, మీనా, కీర్తిసురేశ్ తదితరులు ఈ సినిమాలో న‌టించ‌నున్నారు. న‌వంబ‌ర్ ద్వితీయార్థంలో కరోనా ప్ర‌భావంతో ఆగిన సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌ని యూనిట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. క‌రోనా ప్ర‌భావంతో సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి.

More News

షాకింగ్.. గంగవ్వకు అనారోగ్యం.. హౌస్‌లో ఉండలేనంటూ ఆవేదన

బిగ్‌బాస్ షోలోకి ఇవాళ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. షాకింగ్‌గా గంగవ్వ అనారోగ్యం పాలైంది.

శ్రావణిని దారుణంగా వేధించిన ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకూ దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి అకృత్యాలు మాత్రమే తెలిశాయి.

లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మోడీ బయోపిక్ 'మనో విరాగి'

గౌరవనీయులైన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 'మనో విరాగి'.

కళ్లు చెదిరే రేటింగ్‌తో దూసుకుపోతున్న బిగ్‌బాస్ 4

బిగ్‌బాస్ సీజన్ 4 వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసింది. గురువారం మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌‌లో తయారైందన్న డాక్టర్ లీకి షాక్..

కరోనా వైరస్ వూహాన్‌ ల్యాబ్‌లో తయారైందంటూ హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ లి మెంగ్‌ యాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.