close
Choose your channels

ఆసుపత్రి పాలైన మరో మాజీ సీఎం..

Saturday, September 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అసోం మాజీ సీఎంలు వరుసగా ఆసుపత్రి పాలవుతున్నారు. మాజీ సీఎం తరుణ్ గోగోయ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన ఇటీవల ఆసుపత్రి పాలయ్యారు. తాజాగా మరో అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా(68) శుక్రవారం సాయంత్రం అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. నిపుణులైన వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.

33 ఏళ్ల వయసులోనే మహంతా అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. అసోం గణపరిషత్ (ఏజీపీ) హయాంలో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్ అసోం స్టూడెంట్స్ అసోసియేషన్‌ను వ్యవస్థాపకుడు కూడా మహంతాయే కావడం గమనార్హం. 1980కి పూర్వం యాంటీ-ఇమిగ్రెంట్స్ ఆందోళనలో మహంతి కీలక పాత్ర పోషించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.