ఏపీ ఎస్‌ఈసీ మరో కీలక నిర్ణయం..

  • IndiaGlitz, [Monday,January 25 2021]

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎస్‌ఈసీ మధ్య జరుగుతున్న పోరులో అంతిమ విజయం మాత్రం ఎస్‌ఈసీకే దక్కింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన అధికార యంత్రాంగం మాత్రం ఎస్‌ఈసీకి సహకరించే పరిస్థితి లేదు. ముందు నుంచే ఈ ఎన్నికలకు తాము సహకరించబోమని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర కెబినెట్ కార్యదర్శికి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ అప్పజెప్పామని పేర్కొన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటున్నామన్నారు. కానీ కొంత మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనమని చెబుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సేవలకు అనుమతివ్వాలని కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖలో స్పష్టం చేశారు.

More News

నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ

అక్కినేని నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా?  అంటే అవున‌నే వార్త‌లు సినీ వ‌ర్గాల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

త‌లైవా ‘అణ్ణాత్తే’ రిలీజ్ డేట్ ఖ‌రారు

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ‘అణ్ణాతే’. శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ ‘అణ్ణాతే’ సినిమాను నిర్మిస్తుంది.

సాయితేజ్‌, దేవ క‌ట్ట ...‘రిపబ్లిక్’

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులకు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు అందిస్తున్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ పంచాయతీ ఎన్నికలకు ముందు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్న సమరానికి సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.