ప‌వ‌న్ 27...మ‌రో డైరెక్ట‌ర్ కూడా జాయిన‌య్యాడు..!

  • IndiaGlitz, [Wednesday,March 03 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’(వినిపిస్తోన్న టైటిల్). ప్రస్తుతం హైదరాబాద్‌లో చ‌క చ‌కా జ‌రుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫైట్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నాడు. వ‌స్తాదుల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫైట్ సీక్వెన్స్‌ల‌ను యూనిట్ చిత్రీక‌రిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు స్థ‌లంలో వేసిన గండిపేట సంస్థానం, ఛార్మినార్ సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మొఘ‌ల్ కాలానికి చెందిన క‌థాంశంతో సినిమాను క్రిష్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయబోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మేకింగ్‌లో వి.ఎఫ్‌.ఎక్స్ కూడా కీల‌క భూమిక‌ను పోషిస్తుంది. దీంతో డైరెక్ట‌ర్ క్రిష్ యూనిట్‌ను రెండు భాగాలుగా డివైడ్ చేశాడ‌ట‌. ఓ యూనిట్‌కు క్రిష్ సార‌థ్యం వ‌హిస్తే.. మ‌రో యూనిట్‌కు ల‌క్ష్మీకాంత్ చెన్న సార‌థ్యం వ‌హిస్తాడు. బాబుబాగా బిజీ, క‌మిట్‌మెంట్ చిత్రాలను తెర‌కెక్కించిన ల‌క్ష్మీకాంత్‌కు ఇదొక గొప్ప అవ‌కాశమ‌నే చెప్పాలి. మ‌రి ఆయ‌నెలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి మ‌రి.

మొఘ‌ల్ చ‌క్ర‌వర్తి ఔరంజేబు పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ న‌టిస్తుండగా నిధి అగ‌ర్వాల్‌, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇందులో బందిపోటు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. కాగా.. ఈసినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను మ‌హా శివ‌రాత్రి సందర్భంగా మార్చి 11న విడుద‌ల చేస్తున్నారు.

More News

పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ సినిమా 'సావిత్రి w/o సత్యమూర్తి' ప్రారంభం

'కేరింత' ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'.

కరోనా ఎఫెక్ట్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ప్రపంచంపై అంతా ఇంతా కాదు. చాలా వరకూ సంస్థలన్నీ కుదేలైపోయాయి.

‌'గుండె క‌థ వింటారా' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మ‌ధునంద‌న్‌

ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, గీతాంజ‌లి, ఒక లైలా కోసం, టాక్సీవాలా త‌దిత‌ర స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్‌లో న‌టించిన పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ 'గుండె క‌థ వింటారా'

రాజశేఖర్ హీరోయిన్‌గా ‘జార్జిరెడ్డి’ బ్యూటీ

‘జార్జిరెడ్డి’ సినిమాతో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ముస్కాన్ ఖుబ్చందాని.

కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న మంత్రి గారి రాసలీలలు..

ఓ మంత్రిగారి రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ రక్షించాల్సిన మంత్రే భక్షించాలని చూసిన వైనం కర్ణాటకలో