‘బుట్ట‌బొమ్మ‌..’  మ‌రో రికార్డ్‌

  • IndiaGlitz, [Monday,June 01 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది. సినిమా జనవరిలో విడుదలైనప్పటికీ ఏదో ఓ ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా పాట‌లు. త‌మ‌న్ అందించిన సంగీతం మ‌రో లెవ‌ల్‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా మూడు పాట‌లు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..., రాములో రాముల‌..., బుట్ట‌బొమ్మ లిరిక‌ల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక సినిమా విడుద‌లైన విడుద‌లైన వీడియో సాంగ్స్‌కు లిరిక‌ల్ వీడియోల‌ను మించిన రెస్పాన్స్ వ‌చ్చింది. ఒక్కొక్క వీడియోకు 100 మిలియ‌న్ వ్యూస్ దాటేశాయి. టాప్ 100 గ్లోబ‌ల్ సాంగ్స్‌లో బుట్ట‌బొమ్మ‌.., రాములో రాముల‌.., సాంగ్స్ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ పాట‌లు వాటికవే పోటీ ప‌డుతుండ‌టం విశేషం.

ముఖ్యంగా బుట్ట‌బొమ్మ సాంగ్‌లో బ‌న్నీ స్టెప్పుల‌ను చూసిన సెల‌బ్రిటీలంద‌రూ డాన్సులు చేస్తూ ఆ వీడియోల‌ను టిక్‌టాక్‌లో పోస్ట్ చే్శారు. శిల్పాశెట్టి, దిశా ప‌టాని, వార్న‌ర్ ఇలా అంద‌రూ ఈ పాట‌కు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ లేటెస్ట్‌గా మ‌రో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 200 మిలియ‌న్ మార్కును ఈ పాట చేరుకోవ‌డం విశేషం.

More News

లాక్ డౌన్ 5.0 : దశల వారీగా వీటికి మాత్రమే అనుమతి

కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో మరోసారి లాక్ డౌన్‌ (5.0)ను పొడిగించిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లను పరిగణనలోకి తీసుకుని దేశంల లాక్ డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం,

లాక్ డౌన్ 5.0 : అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేత

న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం జూన్-30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

జూన్-30 వరకు 5.0 లాక్ డౌన్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగించింది.

స‌మంత టెర్ర‌స్ గార్డెనింగ్

ప్ర‌స్తుతం సినీ సెల‌బ్రిటీలు, సామాన్యులు అంద‌రూ ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. ఏదీ ప‌డితే అది కొనేయాల‌నుకోవ‌డం లేదు.

మ‌హేశ్ 27 ‘స‌ర్కారు వారి పాట‌’

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ఈ సినిమా టైటిల్ లోగోను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు.