గోపీచంద్‌తో మ‌రో స్టార్ హీరోయిన్‌..?

  • IndiaGlitz, [Tuesday,June 16 2020]

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ... ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు. ల‌వ్‌స్టోరీస్‌ను తెర‌కెక్కించ‌డంలో దిట్ట‌గా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ త‌ర్వాత స‌క్సెస్‌ల‌ను సాధించ‌డంలో వెనుక‌బ‌డ్డాడు. ఇక తేజ అనే డైరెక్ట‌ర్ లేడేమో అని అనుకుంటున్న స‌మ‌యంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో స‌క్సెస్ సాధించి మ‌ళ్లీ త‌న ఉనికిని చాటుకున్నాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'ను తెర‌కెక్కించాల్సింది కానీ.. ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు. కానీ త‌ర్వాత తేజ తెర‌కెక్కించిన 'సీత‌' బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈయ‌న త‌దుప‌రి సినిమాల‌పై ప‌లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తెలుగులో రానాతో ఓ సినిమా, గోపీచంద్‌తో మ‌రో సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో తేజ బిజీగా ఉన్నాడు. ఇందులో గోపీచంద్‌తో అలివేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌నే దానిపై తేజ చాలా క‌స‌రత్తే చేశాడ‌ట‌. అనుష్క‌, కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. తాజాగా ఈ లిస్టులో కీర్తిసురేశ్ పేరు చేరింది. మ‌రి తేజ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి ఓకే చెబుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

అబ్బాయ్ త‌ర్వాత బాబాయ్‌తో ....

యువ క‌థానాయ‌కుడు న‌వీన్‌చంద్ర కేవ‌లం హీరోగానే కాకుండా కీల‌క‌మైన పాత్ర‌ల్లోనూ న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నాడు.

రెమ్యున‌రేష‌న్స్ విష‌యంలో కీర్తి ఆలోచ‌న‌

కరోనా ప్రభావంతో చాలా రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది.

40 ఏళ్లలో తొలిసారి.. ఆస్కార్స్ వాయిదా

ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డుల‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఈ అవార్డుల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుంటారు.

'ఫ్యామిలీ ప్యాక్' మోషన్ పోస్టర్ విడుదల

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.

'కొంటె కుర్రాడు' టైటిల్ పోస్టర్ విడుదల

ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్,బ్యానర్ లో మాస్ మహారాజ  రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో