రాజ‌మౌళి చిత్రంలో మ‌రో సూపర్ స్టార్ ?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్‌ని ఉగాదికి విడుద‌ల చేశారు. సినిమాపై ఉన్న అంచ‌నాలు మోష‌న్ పోస్ట‌ర్‌తో రెట్టింపు అయ్యాయి. తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్, ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి స్టార్స్ న‌టిస్తుండ‌టంతో ఐఫీస్ట్‌గా సినిమా ఉండ‌నుంది.

అయితే తాజాగా సినీ వ‌ర్గాల్లో, సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న వార్త‌ల మేర‌కు మ‌రో సూప‌ర్‌స్టార్ కూడా ఆర్ఆర్ఆర్‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. రాజ‌మౌళి ఇప్ప‌టికే ఆయ‌న‌కు పాత్ర గురించి వివ‌రించాడ‌ని ఆయ‌న కూడా ఆస‌క్తిగానే ఉన్నాడ‌ట‌. ఇంత‌కు ఆ సూప‌ర్‌స్టార్ ఎవ‌రో కాదు.. మోహ‌న్‌లాల్‌. ఈయ‌న న‌టిస్తే సినిమా రేంజ్ మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో తార‌క్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. రెండు చారిత్రాత్మ‌క పాత్రలు క‌లుసుకుంటే ఎలా ఉంటుంద‌నే క‌ల్పిత‌గాథ‌తోనే సినిమా తెర‌కెక్కుతోంది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

More News

తార‌క్ అన్నీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతాడు..!

‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు ప్ర‌త్యేక కార‌ణాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘బాహుబ‌లి’ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

ఇండియాలో ఫస్ట్ టైమ్ కోవిడ్-19 మైక్రోస్కోపీ చిత్రం

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో రోజురోజుకూ కరోనా

లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం.. ఇళ్లలో నుంచి బయటికి రాకండి : కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఏప్రిల్-15 వరకు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన..

అదంతా ఫేక్.. ఈ ఫుడ్ తింటే కరోనా ఖతం: కేసీఆర్

కరోనా వైరస్ భయంతో ప్రజలు అందరూ అల్లాడుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన

బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కూడా కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చిందనే షాకింగ్ విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త విన్న కొన్ని గంటల వ్యవధిలేనే మరో ఊహించని విషయం వెలుగుచూసింది.