close
Choose your channels

ప‌వ‌న్ 27 రేసులో మ‌రో టైటిల్‌..!

Monday, September 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌న్ 27 రేసులో మ‌రో టైటిల్‌..!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తోన్న పీరియాడిక‌ల్ మూవీ ఒక‌టి సెట్స్‌పై ఉంది. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ చిత్రం..నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలంటే ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ అవ‌స‌రం. దీంతో ఎంటైర్ యూనిట్ ప‌వ‌న్ రాక‌కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ప‌వ‌న్ ఈ చిత్రంలో దొంగ‌గా న‌టించ‌బోతున్నారంటూ, ఆయ‌న‌ పాత్ర గురించి ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వినిప‌స్తున్నాయి. అలాగే ఈ సినిమాకు విరూపాక్ష‌, గజ‌దొంగ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

కాగా తాజా స‌మాచారం మేర‌కు ‘ఓం శివ‌మ్‌’ అనే మ‌రో టైటిల్ కూడా ఇప్పుడు ప‌రిశీల‌న‌లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, మ‌రో హీరోయిన్ ఈ సినిమాలో న‌టిస్తుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ‘వకీల్‌సాబ్‌’ సినిమాను పూర్తి చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇది పూర్త‌యిన త‌ర్వాతే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసే సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతార‌ట‌. ఇది కాకుండా పవన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌లోనూ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమాలు చేయాల్సి ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.