ఏఎన్నార్ నా హృదయంలో ఉన్నారు: రేఖ

  • IndiaGlitz, [Monday,November 18 2019]

టాలీవుడ్ దివంగత నటుడు ఏఎన్నార్ తన హృదయంలో ఉన్నారని బాలీవుడ్ అందాలరాశి, దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్‌ను ఏలిన రేఖ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. 2019 సంవత్సరానికి రేఖకు అక్కినేని జాతీయ పురస్కారాలకు ఎంపికైన విషయం తెలిసిందే. ఇవాళ ఈ అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రేఖ అవార్డ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన రేఖ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మా అమ్మ కోరిక మేరకు..!

‘అన్నపూర్ణ స్టూడియోకు వస్తే నా సొంతింటికి వచ్చినట్టుంది. వేదాంతం రాఘవయ్యగారు మా చిన్నాన్న. నా జీవితంలో మొదటి సారి చూసిన చిత్రం అక్కినేని సువర్ణసుందరి. సువర్ణసుందరి ఒక వందసార్లు చూసి ఉంటాను. నేను ఈ వేదికపై ఉన్నానంటే అక్కినేని, అంజలిదేవి కారణం. ఏఎన్నార్ నా హృదయంలో ఉన్నారు. మా అమ్మ ఆఖరి కోరిక మేరకు తెలుగు సినిమా చేశాను’ అని రేఖ చెప్పుకొచ్చారు. కాగా అంతకుముందు రేఖ గురించి నాగ్ మాట్లాడుతూ.. రేఖను పొగడ్తల్లో ముంచేశారు. రేఖ..‘ కాలంతో పనిలేని అందగత్తె’ అని అభివర్ణించారు. ఈ అవార్డుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రేఖ, బోనీకపూర్ తదితరులు హాజరయ్యారు.

More News

నా ఆరాధ్య నటి రేఖ.. అందుకే నా భార్యను.. : చిరంజీవి

‘నటి రేఖ అంటే నాకు ఎంతో ఇష్టం. చిరంజీనా ఆరాధ్య నటి రేఖ.. అందుకే ఆ పేరుతో నా భార్య సురేఖను పిలుస్తుంటాను’ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఓ మై గాడ్: అవార్డ్ ఫంక్షన్‌లో నాగ్ పరువు తీసిన రేఖ..!

టైటిల్ చూడగానే అవునా.. అంత పెద్ద ఇష్యూ ఏం జరిగిందబ్బా అని ఆశ్చర్యపోకండి.. అదేం లేదు ఇదంతా సరదా అంతే.

తెలుగు సినిమా ఉన్నంత వరకూ అక్కినేని ఉంటారు: నాగ్

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కారాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

'పరారి' ఆడియో లాంచ్

యోగేశ్వర్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'పరారి'. ''రన్‌ ఫర్‌ ఫన్‌'' అనేది ఉప శీర్షిక. అతిథి హీరోయిన్‌గా నటిస్తోంది.

ప‌వ‌న్ వ‌ల్లే 'జార్జిరెడ్డి' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ క్యాన్సిల్‌

ఉస్మానియా కాలేజీ విద్యార్థి నాయ‌కుడు జార్జ్‌రెడ్డి జీవిత క‌థ‌ను ఆధారం  చేసుకుని తెర‌కెక్కిన చిత్రం `జార్జి రెడ్డి`.