'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' ఫస్ట్‌ లుక్‌ విడుదల

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన చిత్రమిది. ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

వీరి నాయుడు మాట్లాడుతూ ‘‘సినిమా మార్కెట్‌లో నన్ను ‘పూర్వి’ రాజు అంటారు. విశాఖలో పూర్వి పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ స్థాపించి, పాతిక సంవత్సరాల నుండి విజయవంతమైన చిత్రాలు చాలా విడుదల చేశాను. మా అబ్బాయి శ్రీనివాస్‌, అతడి మిత్రుడు బాలు, ఇద్దరి స్నేహితులు కలిసి ఈ సినిమా చేశారు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్‌ భరత్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌ లుక్‌ ట్రెండీగా, కమర్షియల్‌గా ఉంది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమాకు మంచి కలెక్షన్స్‌ రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘సుధాకర్‌రెడ్డిగారికి చాలా చాలా థ్యాంక్స్‌. వీరి నాయుడుగారు మాకు ఎంతో అండగా ఉన్నారు. వాళ్లబ్బాయి శ్రీనివాస్‌, మేం కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి, ఈ సినిమా చేశాం. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాందాస్‌ పాల్గొన్నారు.

More News

'అల వైకుంఠపురంలో..' నుంచి రేపు మరో స్పెషల్ సర్‌ప్రైజ్!

టాలీవుడ్ యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో..’.

కొత్త షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ 'శ్రీకారం'

శ‌ర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం `శ్రీకారం`. 14రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై కిషోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ నుండి సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

రానా సినిమా డైరెక్ట‌ర్‌, కెమెరామెన్ మ‌ధ్య గొడ‌వ‌ ?

సాధార‌ణంగా సినిమా మేకింగ్‌లో స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డ‌మ‌నేది కామ‌న్‌గానే జ‌రుగుతుంటాయి. అయితే అవి అప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతూ ఉంటాయి.

ఫ్యాన్సీ రేటుకు `స‌రిలేరు నీకెవ్వ‌రు` డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి దర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతుంది. సినిమా ఇప్పుడు తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌కు చేరుకుంది. కాగా..

ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరిన యాంక‌ర్ సుమ‌

సుమ క‌న‌కాల అంటే ఎవ‌రా? అని అనుకుంటారేమో కానీ యాంక‌ర్ సుమ అంటే ఎవ‌రికైనా వెంట‌నే గుర్తు వ‌చ్చేస్తుంది ఈమె. ఈ యాంక‌ర‌మ్మ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరారు.