అల్లు అర్జున్ బాటలో అనుష్క?

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

ఈ సంవ‌త్స‌రం అనుష్క కెరీర్‌లో ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఈ సంవ‌త్స‌రం అనుష్క న‌టించిన తెలుగు సినిమాల‌న్నీ యాక్టింగ్ స్కోప్ ఉన్న‌వే. 'బాహుబ‌లి', 'రుద్ర‌మ‌దేవి'ల‌తో ఇప్ప‌టికే త‌న గురించి మాట్లాడేలా చేసిన అనుష్క‌.. రేపు రిలీజ్ కానున్న 'సైజ్ జీరో'తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచే పాత్ర‌తో క‌నువిందు చేయ‌నుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో 1500 స్క్రీన్స్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమా.. అనుష్క గ‌త రెండు చిత్రాల మాదిరిగానే ఓ ఫీట్‌ని కంటిన్యూ చేస్తుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అదేమిటంటే.. 50 కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం. 'బాహుబ‌లి', 'రుద్ర‌మ‌దేవి' చిత్రాలు 50 కోట్ల‌కి పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన నేప‌థ్యంలో 'సైజ్ జీరో' కూడా అదే బాట‌లో ప‌య‌నించి.. అనుష్క కి ఒకే ఏడాదిలో మూడు యాభై కోట్ల షేర్ సాధించిన చిత్రాల నాయిక‌గా ప్ర‌త్యేక గుర్తింపుని తీసుకువ‌స్తుందో లేదో అని సినీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. హీరోల‌లో అల్లు అర్జున్ వ‌రుస‌గా మూడు యాభై కోట్ల రూపాయిల వ‌సూళ్ల‌ను సాధించిన చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ట్లే.. హీరోయిన్‌ల‌లో అనుష్క కూడా అదే బాట ప‌డితే క‌నుక చ‌రిత్ర సృష్టించిన‌ట్లే.

More News

విక్రమ్ సినిమాకి మార్పులే మార్పులు

'శివపుత్రుడు','అపరిచితుడు'వంటి తమిళ అనువాదాలతో తెలుగులోనూ మార్కెట్ ని పొందాడు విక్రమ్.పలు తెలుగు చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ..

పోస్ట్ ప్రొడక్షన్ లో 'కళ్యాణ వైభోగమే'

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ".

తెలుగు, తమిళంలో 'బాజీరావ్ మ‌స్తానీ'

ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, సంజ‌య్‌లీలా బ‌న్నాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘బాజీరావ్ మ‌స్తానీ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో కూడా సినిమాను గ్రాండ్ లెవ‌ల్‌లో నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో వందలాది బస్ ల్లో 'బెంగాల్ టైగర్' ప్రమోషన్స్

మాస్ మహరాజ్ రవితేజ,అందాల భామలు తమన్నా,రాశిఖన్నాలు జంటగా,సంపత్ నంది దర్వకత్వంలో,నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్ టైగర్

లచ్చిందేవికి ఓ లెక్కుంది రిలీజ్ డేట్ ఫిక్స్..

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది.ఈ చిత్రాన్ని దర్శకధీర రాజమౌళి శిష్యుడు జగదీష్ తెరకెక్కించారు.