ప‌వ‌న్ 27లో అనుష్క‌..?

  • IndiaGlitz, [Monday,April 06 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. మ‌రో ప‌క్క రీసెంట్‌గానే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న 27వ సినిమాను స్టార్ట్ చేసినట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఈలోపు క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో రెండు సినిమాల షూటింగ్‌ల‌ను ప‌వ‌న్ ఆపేశారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఇది వ‌ర‌కు జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, కీర్తి సురేష్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అనుష్క పేరు కూడా విన‌ప‌డుతుంది. క్రిష్ డైరెక్ట్ చేసిన వేదం సినిమాలో అనుష్క ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు క్రిష్ అడ‌గటంతో అనుష్క ప‌వ‌న్ 27లో న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌న్ 27 రూపొంద‌నుంది. ఎ.ఎం.ర‌త్నం ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళిలో విడుద‌ల చేయాల‌నుకున్నారు. మ‌రి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఈ సినిమా షెడ్యూల్‌పై ప‌డి సినిమా ఆల‌స్య‌మ‌వుతుందేమో చూడాలి.

More News

గ్యాప్‌లో.. ప్ర‌భాస్ 21 ద‌ర్శ‌కుడేం చేస్తున్నాడంటే..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్

'లూసీఫర్' రీమేక్‌ పవన్ చేస్తానంటే.. : చిరు రియాక్షన్ ఇదీ..

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫ‌ర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు.

'ఆచార్య'లో మహేశా.. చెర్రీనా.. క్లారిటీ ఇచ్చేసిన చిరు

టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి.. సూపర్ హిట్ చిత్రాల, సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు అన్ని విషయాలు లీకైపోయాయి.

గోపీచంద్ స‌ర‌స‌న హాట్ బ్యూటీ

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఏపీలో 190కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గంటగంటకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 164 ఉన్న కేసులు.. శనివారం సాయంత్రానికి 190కు చేరుకుంది.