అనుష్క 'నిశ్శబ్ధం' షురూ!
Send us your feedback to audioarticles@vaarta.com
భాగమతి తర్వాత బరువు తగ్గే పనిలో బిజీగా ఉండిపోయిన అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వా తెలుగులో సినిమా చేయడానికి సిద్ధమైంది. ఆ సినిమాయే సైలెన్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై సినిమా నిర్మితం అవుతుంది. తెలుగులో 'నిశ్శబ్ధం' పేరుతో సినిమా విడుదలవుతుంటే.. ఇతర భాషల్లో సైలెన్స్ పేరుతో రూపొందనుంది.
మాధవన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ కూడా నటిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకుడు. సైలెన్స్ థ్రిల్లర్ జోనర్లో సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో అనుష్క బధిర యువతిగా కనిపిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత లుక్ మార్చుకుని అనుష్క నటిస్తున్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.