ప్రభాస్‌తో పెళ్లి పిక్‌పై క్లారిటీ ఇచ్చిన అనుష్క..

  • IndiaGlitz, [Monday,October 05 2020]

ప్రభాస్, అనుష్కల రిలేషన్‌షిప్ గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని వారిద్దరూ చెప్పినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు. చివరకు అనుష్క అభిమానులు కూడా ఆమె వారితో ట్విట్టర్‌లో చిట్ చాట్ ద్వారా ఇవే ప్రశ్నలు అడిగారు. ఆదివారం అనుష్క అభిమానులతో ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ చేసింది. గతంలో అనుష్క, ప్రభాస్‌ల పెళ్లికి సంబంధించిన క్యాండిడ్ పిక్ ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. అనుష్క అభిమానులతో చిట్‌చాట్‌లో భాగంగా ఒకరు అనుష్కను దీనిపై ప్రశ్నించారు.

ఆ క్యాండిట్ పిక్‌పై స్వీటీ క్లారిటీ ఇచ్చింది. ఆ పిక్ మూవీ షూటింగ్‌లో భాగంగా తీసినది కాదని.. ఒక మూవీ పోస్టర్ కోసం తీసిన పిక్ అని అనుష్క తెలిపింది. ఆ పిక్ తనకు చాలా ఇష్టమైన మూవీకి సంబంధించినదని అనుష్క వెల్లడించింది. ‘‘మిర్చి సినిమా కోసం అందమైన పోస్టర్ రూపొందించడంలో భాగంగా మేమిద్దరం షాట్ గురించి చర్చించుకుంటున్నప్పుడు ఆ పిక్ తీశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన తొలి మూవీ.. అది నాకు చాలా ఇష్టమైన మూవీ’’ అని అభిమానుల సందేహాన్ని అనుష్క తీర్చింది.

ప్రస్తుతం అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ ఓటీటీ వేదికగా విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క ఒక ఛాలెంజింగ్ రోల్‌లో నటించింది. మాధవన్‌తో కలిసి చాలా కాలం తర్వాత తిరిగి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని అనుష్క తెలిపింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతున్న అనుష్క.. తన తదుపరి చిత్రం ఎలాంటిది ఎంచుకుంటుందో వేచి చూడాలి.

More News

పవన్‌కు జెడ్ కేటగిరి భద్రత అంటూ న్యూస్ వైరల్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను కల్పించిందంటూ ఓ న్యూస్ ఆదివారం తెగ వైరల్ అయింది.

జంబలకిడి పంబ అదుర్స్.. అందరూ సేఫ్..

స్వాతి నిన్న ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

నాని చిత్రంలో కన్నడ బ్యూటీ..?

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అత్యంత ఖరీదైన మోసాలలో ఏపీ ఫస్ట్: ఎన్‌సీఆర్‌బీ

ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆర్థిక నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉండగా..

రసవత్తరంగా తమిళ రాజకీయం.. క్షణ క్షణం టెన్షన్ టెన్షన్..

తమిళ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఈ నెల 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.