close
Choose your channels

చిరు ఇంటికెళ్లిన సోము వీర్రాజు.. పలు విషయాలపై చర్చ

Thursday, August 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిన నేడు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని చిరు ఇంటికి వెళ్లి చిరును సోము వీర్రాజు కలిశారు. సోము వీర్రాజును పుష్పమాల, శాలువాతో చిరు సత్కరించారు. పలు విషయాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలని సోము వీర్రాజుకు చిరు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ బీజేపీతో కలిసి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు, సోము వీర్రాజులు కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.