close
Choose your channels

ఒడిశాకు ఏపీ సీఎం.. జగన్‌పై అభిమానం చాటుకున్న తెలుగువారు, భువనేశ్వర్‌ నిండా ఫ్లెక్సీలే

Wednesday, November 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒడిశాకు ఏపీ సీఎం.. జగన్‌పై అభిమానం చాటుకున్న తెలుగువారు, భువనేశ్వర్‌ నిండా ఫ్లెక్సీలే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఒడిశాలోని తెలుగువారు అభిమానం చాటుకున్నారు. నిన్న భువనేశ్వర్‌ పర్యటనకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఒడిశాలోని తెలుగు సంస్థలైన బరగఢ్‌ అత్తాబిరా కోసలాంధ్ర కల్చరల్‌ అసోషియేషన్‌, భువనేశ్వర్‌ ఆంధ్ర సాంస్కృతిక సమితి, కటక్‌ ఐక్యత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విమానాశ్రయం నుంచి స్టేట్ గెస్ట్‌హౌస్ వరకు రోడ్డుకు ఇరువైపులా దాదాపు 80 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయనపై అభిమానం చాటుకున్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో జగన్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆయనను కలిసి జ్ఞాపికలు అందజేశారు. జగన్‌ను కలవడం పట్ల రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని కోసలాంధ్ర కల్చరల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు డి.మురళీకృష్ణ మీడియాకు తెలిపారు. అలాగే ఏపీ- ఒడిషా సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.