close
Choose your channels

చిరు వ్యాపారులకు ఆసరా.. 5 లక్షల మంది ఖాతాల్లోకి ‘‘జగనన్న తోడు’’ డబ్బులు

Monday, February 28, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు వ్యాపారులకు ఆసరా.. 5 లక్షల మంది ఖాతాల్లోకి ‘‘జగనన్న తోడు’’ డబ్బులు

రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టింది. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని జగన్ వెల్లడించారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని... వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

తన సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని జగన్‌ చెప్పారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని... మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల రుణం అందజేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వడ్డీ రీఎంబర్స్‌మెంట్‌ రూ.16.16 కోట్లు కలిపి మొత్తం రూ.526.62 కోట్ల లబ్ధి చేకూరుతుందని జగన్ చెప్పారు. అర్హులై ఉండి రుణం రాకపోతే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయంలో అన్ని రకాల సహాయం దొరుకుతుందని.. ఎలాంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు అందిస్తున్నామన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.