చిన్న కుమార్తె అడ్మిషన్ కోసం అమెరికాకు వైఎస్ జగన్!

  • IndiaGlitz, [Thursday,August 15 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్‌ నుంచి జగన్.. అమెరికా వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జగన్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా.. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు ఆగస్ట్‌ 17న ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో సీఎం ప్రసంగించనున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లునున్నారు.

ఈ సందర్భంగా.. చిన్న కుమార్తె వర్షా రెడ్డిని ఉన్నత విద్య కోసం అమెరికాలోని ఓ విద్యాసంస్థలో చేర్చుతున్నారని సమాచారం. అడ్మిషన్ ప్రక్రియ కోసం ఆయన అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇండియానా స్టేట్‌లోని ప్రతిష్ఠాత్మక ‘నోట్రెడామ్ యూనివర్శిటీ’లో వర్షా రెడ్డికి సీటు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆమె ఆ యూనివర్శిటీలో అడ్మిషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. కాగా గురువారం రాత్రి.. రాత్రి 9.30 గంటలకు జగన్ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. పర్యటన ముగించుకుని ఈ నెల 24న రాష్ట్రానికి జగన్ తిరిగి వస్తారు. ఇప్పటికే ఆయన పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ప్రస్తుతం లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ‘లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో విద్యను అభ్యసిస్తున్న విషయం విదితమే.

More News

‘2 బుల్లెట్లు కాల్చుకోవాలే.. 2 దాచుకోవాలె’ వాల్మీకీ టీజర్

వ‌రుణ్ తేజ్, అథ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సూపర్ హిట్టవ్వగా..

అనుష్కతో డేటింగ్, లవ్, పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి రెండ్రోజులకోసారి వార్తలు వస్తూనే ఉంటాయన్న విషయం విదితమే. గత కొన్ని రోజులుగా మళ్లీ ప్రభాస్ పెళ్లిపై వార్తలు షురూ అయ్యాయి. వార్తలే కాదు..

పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

‘మీరు ఓడిపోవడమేంటయ్యా.. మీ కష్టాలు పగోడికి కూడా రావొద్దు’!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఇప్పటి వరకూ ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత మొదలుకుని నారా లోకేశ్..

'గ్యాంగ్‌ లీడర్‌' రెండో పాట విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం