ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్షన్నర దాటేశాయి. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో నాలుగు రోజుల పాటు 10 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం మాత్రం కొత్తగా 9,276 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరాయి. కరోనాతో నేడు 58 మంది మృతి చెందగా.. మొత్తంగా 1407 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 72,188 యాక్టివ్ కేసులున్నాయి.

నేడు ఒక్కరోజే 12,750 మంది కరోనా కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకూ 76,614 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నేడు కరోనాతో తూర్పు గోదావరిలో 8 మంది, విశాఖలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, అనంతలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు.

More News

సింగపూర్‌లో చికిత్స పొందుతూ అమర్ సింగ్ మృతి

రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్(64) మృతి చెందారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు.

‘వకీల్‌సాబ్‌’కు డేట్స్ కేటాయించిన శృతి..!

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.

అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న దిల్‌రాజు

తెలుగు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. అనాథ‌లైన ముగ్గురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు.

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!..ఇది అక్కినేని నాగార్జున అభిమానుల‌కే కాదు.. సినీ ప్రియుల‌లంద‌రికీ శుభ‌వార్తే.

అల్లు అర్జున్ 21... పాయింట్ అదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ త‌న కెరీర్‌ను చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో