అవినీతి పాలనే మా ధ్యేయమన్న ఏపీ డిప్యూటీ సీఎం!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే తప్పుగా ఉంది కదా.. అని కాసింత కన్ఫూజ్ అవుతున్నారా..? అవును మీరు చదివింది నిజమే.. మేం రాసింది నిజమే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తడబడ్డారు. అసలేం జరిగింది..? నిజంగానే ఆమె నోరు జారారా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూన్-08న డిప్యూటీ సీఎంగా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే వరుస మీటింగ్లు, అసెంబ్లీ సమావేశాలతో బిజిబిజీగా ఉన్న ఆమె.. శనివారం నాడు మొదటి సారి విజయనగరం విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, వైసీపీ శ్రేణులు, అనుచరులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.
ఇంతకీ ఆమె ఏమన్నారు..!?
ఈ క్రమంలో అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో తడబడ్డ ఆమె ఏదో చెప్పాలనుకుని.. ఇంకేదో చెప్పేసి మీడియాకు అడ్డంగా చిక్కిపోయారు. "మా ముఖ్యమంత్రి ఒకటే లైన్తో వెళుతున్నారు. అవినీతి పాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం" అని పుష్పశ్రీవాణి మాట తడబడ్డారు. ఈ మాటలు విన్న అనుచరులు, కార్యకర్తలు కంగుతిన్నారు. అయితే కొంత సేపటికే ఆ తడబాటు గురించి తెలుసుకున్న ఆమె.. సారీ చెప్పి తప్పు సరిదిద్దుకున్నారు.
నెటిజన్లు ఏమంటున్నారు..!?
అయితే.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో.. మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇదేంటి మేడమ్గారు ఇలా అనేశారు..? నోరు జారారా..? లేకుంటే మనసులో ఉన్నది చెప్పేశారా..? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా అటు టీడీపీ కార్యకర్తలు.. ఇటు జనసేన కార్యకర్తలు ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా మరికొందరు నెటిజన్లు మాత్రం ఫస్ట్ టైమ్ కదా.. అలానే తప్పులు దొర్లుతాయని సింపుల్గా చిన్న మాటతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.