ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు

  • IndiaGlitz, [Saturday,October 10 2020]

ఏపీ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్2లో ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరయ్యారు. వారిలో 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి సురేష్ తెలిపారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరయ్యారు. వారిలో 9,616 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.

కాగా.. ఇంజనీరింగ్‌లో 84.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 91.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగింది. కాగా.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు సైతం ఉండటం విశేషం. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. కాగా.. ఈ నెల 14న వెబ్ సైట్‌లో ర్యాంక్ కార్డ్స్‌ను అప్‌లోడ్ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

ఇంజనీరింగ్‌లో టాపర్స్ వీరే..

మొదటి ర్యాంక్ : వావిలపల్లి సాయినాథ్, విశాఖపట్నం

రెండో ర్యాంక్ : కుమార్ సత్యం, హైదరాబాద్

మూడో ర్యాంక్ : గంగుల భువన రెడ్డి, కడప

నాలుగో ర్యాంక్ : మొర్రెడ్డిగారి లికిత్ రెడ్డి, రంగారెడ్డి, తెలంగాణ

ఐదవ ర్యాంక్ : చాగారి కౌషల్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్, తెలంగాణ

ఆరో ర్యాంకు - కె.వి.దత్త శ్రీహర్ష, రాజమహేంద్రవరం)

ఏడో ర్యాంకు - వారణాసి సాయితేజ, రంగారెడ్డి


ఎనిమిదో ర్యాంకు - హార్దిక్‌ రాజ్‌పాల్‌, రంగారెడ్డి

తొమ్మిదో ర్యాంకు - కొత్తకోట కృష్ణసాయి, శ్రీకాకుళం


పదో ర్యాంకు - లండ జితేంద్ర, విజయనగరం

అగ్రికల్చరల్ & మెడిసన్‌లో టాప్ ర్యాంకర్స్

మొదటి ర్యాంక్ : గుత్తి చైతన్య సింధూ, తెనాలి

రెండో ర్యాంక్ : త్రిపురనేని లక్ష్మీ సాయి మూర్తి, తాడికొండ, గుంటూరు

మూడో ర్యాంక్: వి.మనోజ్ కుమార్, తిరుపతి చిత్తూరు

నాలుగో ర్యాంక్ : దార్సి విష్ణు సాయి, నెల్లూరు

ఐదవ ర్యాంక్ : ఆవుల సుబాంగ్, రంగారెడ్డి, తెలంగాణ

ఆరో ర్యాంకు - సింగిరెడ్డి అవిష్‌రెడ్డి, మేడ్చల్‌)

ఏడో ర్యాంకు - ఎర్రగుడి లిఖిత, కడప

ఎనిమిదో ర్యాంకు - జడ వెంకట వినయ్, కడప

తొమ్మిదో ర్యాంకు - సోగనూరు నితిన్‌ వర్మ, కర్నూలు

పదో ర్యాంకు - మురికిపూడి రేవంత్‌, గుంటూరు

More News

ఓటు హక్కుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

ఇప్పుడున్న కుర్ర హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కొన్ని భావాల‌ను ఓపెన్‌గా చెప్ప‌డమే విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న అల‌వాటు.

వామ్మో.. రాజమౌళిపై ఇన్ని కంప్లైంట్సా?.. చెర్రీ, తారక్ కూడా..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ఇప్పుడు ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. టాలీవుడ్ వ‌ర‌కు ప‌రిమితం అయిన ఈ డైరెక్ట‌ర్ బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో పేరును సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

'పీన‌ట్ డైమండ్' చిత్రం ప్రారంభం

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా రూపొందుతోన్న

దిశ సినిమాపై కోర్టులో పిటిషన్‌... స్పందించిన నట్టికుమార్‌

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'దిశా ఎన్‌కౌంటర్‌'. గత ఏడాది నవంబర్‌ 26న దిశపై జరిగిన అత్యాచారం, హత్య...

విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ షాక్‌

హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ శుక్రవారం పెద్ద షాకే ఇచ్చింది. వివరాల్లోకెళ్తే... విశాల్‌, సుందర్‌.సి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'యాక్షన్‌'.ఈ సినిమా విడుదల సమయంలో