సుప్రీంకోర్టుకెక్కిన ఏపీ ‘పంచాయతీ'

  • IndiaGlitz, [Thursday,January 21 2021]

అనుకున్నదంతా అయ్యింది.. ఏపీ ‘పంచాయతీ’ సుప్రీంకోర్టుకెక్కింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టం చేసింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే..

కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.

కోడ్ అమల్లోకి వచ్చిందంటున్న ఎస్‌ఈసీ..

హైకోర్టు తాజా తీర్పుపై జగన్ సర్కార్.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారనేది ముందుగా ఊహించిన విషయమే. అయితే అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఎలా స్పందిస్తుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది..? ఇక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఉంటుందా..? లేకుంటే మరోలా ఉంటుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నికల కమిషన్ మాత్రం ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అంతేకాదు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లేనని ఎస్ఈసీ అంటోంది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.

More News

నల్గొండలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నాగ‌శౌర్య‌, కేపి రాజేంద్ర కాంబినేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక`

యంగ్ హీరో నాగ‌శౌర్య‌హీరోగా కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక‌`.

3 సింహాల మాయం కేసు నిందితులు ఇలా దొరికిపోయారట..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కనకదుర్గమ్మ రథంపై మూడు వెండి సింహాల మాయం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తోంది.

కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: పద్మారావు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సెన్సెక్స్ సంచలనం.. 50 వేల మార్కు దాటి రికార్డ్..

భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో ఈ రోజు సరికొత్త రికార్డు నమోదైంది. కరోనా మహమ్మారి కారణంగా పడిపోయిన సెన్సెక్స్ నేడు ఊహించని రీతిలో ఎగిసింది.