ఏపీలో ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు.. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి, రేసులో ‘అల్లు’ సంస్థ

  • IndiaGlitz, [Tuesday,March 29 2022]

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. త్వరలోనే ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు విక్రయించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం టెండర్లు పూర్తి చేసింది.. ఈ టెండర్లలో జస్ట్ టికెట్ సంస్థ L -1 గా నిలిచినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువగా ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.. ప్రేక్షకులపై ఆన్‌లైన్ చార్జీల భారం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

జస్ట్ టికెట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు, బుక్‌మై షోతో కలిసి మిడిల్ ఈస్ట్ ఏషియాలో వ్యాపారం నిర్వహిస్తున్న మరో సంస్థ బిడ్ దాఖలు చేసినట్టు సమాచారం. ఒక్కో టికెట్‌పై ప్రభుత్వానికి 90 పైసలు చెల్లించేందుకు ఓ సంస్థ, 75 పైసల చొప్పున చెల్లించేందుకు మరో సంస్థ కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే టెండర్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం.

ప్రభుత్వ నిర్ణయంతో టికెట్‌ రేట్ల నియంత్రణతో పాటు క్యూలలో ప్రేక్షకులు గంటలు గంటలు నిలబడాల్సిన పరిస్థితికి, బ్లాక్‌ టికెట్ల మాఫియాకు చెక్‌ పడనుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే సినిమా టికెట్ల విక్రయం చేపట్టాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దీనిని బట్టి ఇకపై ఎఫ్‌డీసీ పోర్టల్‌ ద్వారానే ఆన్‌లైన్‌ టికెట్లు కొనుగోలు చేయాలి.

More News

రూపాయి.. రూపాయి దాచుకుని రూ. 2.6 లక్షల పోగేసి .. డ్రీమ్ బైక్ కొన్న యువకుడు

చిన్నప్పుడు మనకు నచ్చిన వస్తువు అమ్మానాన్న కొనివ్వలేదు అనుకోండి.. అప్పుడేం చేసేవాళ్లం..

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... లాక్‌డౌన్ పరిధిలోకి కీలక నగరం

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అదుపులోనే వుంది. కానీ కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం వైరస్ విజృంభిస్తోంది.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఓటీటీ డేట్ క‌న్ఫార్మ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘రాధేశ్యామ్’’.

సజీవ దహనాల కేసు: బెంగాల్ అసెంబ్లీలో అరుపులు, కేకలు.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్‌‌లో ఇటీవల చోటుచేసుకున్న బీర్‌భూం సజీవద హనాల ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే.

యాదాద్రిలో కన్నుల పండుగగా మహా కుంభ సంప్రోక్షణ... కేసీఆర్ ప్రత్యేక పూజలు

యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ ఘనంగా జరుగుతోంది. దీనిలో భాగంగా కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కన్నుల పండుగగా కొనసాగింది.