close
Choose your channels

‘‘ఆచార్య’’ ఇంటికి మంత్రిగారు..!!

Saturday, April 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా హైదరాబాదులో బిజిబిజీగా గడుపుతున్నారు. తొలుత ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆమె భేటీఅ అయ్యారు. అనంతరం కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ... రోజాను, ఆమె భర్త సెల్వమణిని, పిల్లలను సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు ఆచార్య మూవీ రిలీజ్ సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలియజేశారు. అటు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సత్కరించారు.

కాగా.. మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పలుమార్లు గుర్తు చేసుకునేవారు రోజా. ఆయనకి తాను అభిమానురాలినని, ఆయనతో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పేవారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాను.. చిరంజీవి పక్కన అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒకానొక సందర్భంలో ప్రకటించారు. చిరంజీవి సెట్స్‌లో తనను బాగా చూసుకునేవారని రోజా చెప్పారు. ఆయన నటించిన ‘ఆలయ శిఖరం’ సినిమా సెట్స్‌కు వెళ్లి చిరంజీవితో తన చేతిపై ఆటోగ్రాఫ్‌ తీసుకున్నానని రోజా గుర్తుచేసుకున్నారు. అలాంటి తాను ఆయనతో హీరోయిన్‌గా సినిమాలు చేయడాన్ని తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఒక అభిమాని తన అభిమాన హీరో సరసన హీరోయిన్‌గా చేయడం చాలా అరుదని.. కానీ, ఆ అవకాశం తనకు లభించిందని రోజా పలు వేదికలపై చెప్పేవారు.

అంతకుముందు... తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రోజా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం సతీమణి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవితలు సాంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి వస్త్రాలు బహూకరించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికే ప్రగతి భవన్‌కు వచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ తనను ఓ కూతురి మాదిరిగా చూస్తారని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.