close
Choose your channels

ఆ ఒక్కటి చేస్తే బాలయ్య కూడా వైసీపీలోకే జంప్!?

Sunday, January 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ ఒక్కటి చేస్తే బాలయ్య కూడా వైసీపీలోకే జంప్!?

అవును.. మీరు వింటున్నది నిజమే.. ఈ మాట అన్నది ఎవరో కాదండోయ్ స్వయానా వైసీపీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. వాస్తవానికి ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చే నేతలు కచ్చితంగా వారి పదవులకు రాజీనామా చేసి చేరాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఓ నిబంధన పెట్టారు. ఇప్పటికే పలువురు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చి జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఆరేడుగురు పార్టీలోకి రావాలనుకున్నప్పటికీ వారికి ఈ రాజీనామాలు అడ్డుపడుతున్నాయి. లేకుంటే రేపే జంప్ అవ్వడానికి సిద్ధంగానే ఉన్నారన్నది వైసీపీ నేతల మాట. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మీడియా ముందుకొచ్చి కూడా చెప్పారు.

ఆ ఒక్కటి జరిగితే..!

అయితే తాజాగా మంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తలుపులు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్యేలందరూ అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. ఇదే జరిగితే చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ మాత్రమేనన్నారు. బాలకృష్ణ సంగతేంటి..? అని ప్రశ్నించారు. ‘బాలయ్య మీదున్న కేసును రీఓపెన్‌ చేయిస్తామంటే ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారు. అప్పట్లో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహాయంతోనే బయటపడ్డారు. బాలకృష్ణపై ఉన్న కాల్పుల కేసును తిరిగి తెరుస్తాం అని ఒక్క మాట చెబితే.. ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారు’ అని చెప్పుకొచ్చారు. బాలయ్య పొలిటికల్ బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.