close
Choose your channels

ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా ఏపీ - సీఎం చంద్రబాబు

Saturday, March 29, 2025 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

 ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా ఏపీ - సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, 1995లో హైదరాబాద్ హైటెక్ సిటీని స్థాపించిన విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికమన్నారు.

ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని.. చైనా ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాసు పై ప్రశంసలు కురిపించారు.

"ఐఐటీ మద్రాస్ చాలా విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. వివిధ రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటీ మద్రాస్ కొత్త ఆవిష్కరణలు,స్టార్టప్ అగ్నికుల్ కోస్మోస్, మైండ్‌గ్రో టెక్నాలజీస్ వంటి స్టార్టప్‌ల్లో నూతన పరిశోధనలు భారతదేశాన్ని అంతరిక్షం, సెమీ కండక్టర్ రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్‌లు దాదాపు 80 శాతం సక్సెస్ అయ్యాయి. ఈ ఐఐటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 40 శాతం దాకా ఉన్నారు" అన్నారు.

1995లో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్‌ను కలవాలని అడిగినప్పుడు రాజకీయ నేతలతో సత్సంబంధాలు లేవని, కలవడం కుదరదని అన్నారని.. కానీ ఆయనతో సమావేశమై ఏకంగా 45 నిమిషాలు మాట్లాడానని గుర్తుచేశారు సీఎం. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ స్థాపించాలని బిల్ గేట్స్‌ను కోరానని.. కట్ చేస్తే ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈఓగా ఉన్నారని అన్నారు. యూఎస్ఏలో తెలుగు, తమిళులదే హవా అన్నారు.

"భారతదేశానికి జనాభా గొప్పవరం లాంటింది. మన దేశానికి ఇంకో 40 ఏళ్ల దాకా జనాభా సమస్య ఉండదు. దక్షణ భారతదేశంలో కూడా జనాభాను పెంచాల్సి ఉంది. అమెరికా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం మన దేశీయులదే. అక్కడి ధనిక ప్రాంతాల్లోకి వెళ్లి చూస్తే తెలుగు, తమిళం వారే ఎక్కువ మంది ఉంటారు. భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. సిలికాన్ వ్యాలీ, నాసా, వాల్ స్ట్రీట్‌లలో భారతీయుల ఆధిపత్యాన్ని సాధిస్తున్నారు."

గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే ముందుందన్నారు సీఎం. భవిష్యత్తులో ఏపీ 2 రూపాయలకే యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని, భారతదేశం మొత్తం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఉంటే, ఇందులో 160 గిగావాట్లు ఒక్క ఏపీలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment