‘అరణ్య’ ట్రైలర్: ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం

  • IndiaGlitz, [Wednesday,March 03 2021]

రానా దగ్గుబాటి చేస్తోన్న మరో ప్రయోగం అరణ్య (హిందీలో హాథీ మేరీ సాథీ, తమిళ్‌లో కాదన్) . బాహుబలిలో భళ్లాల దేవుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానా.. ప్రస్తుతం అరణ్య సినిమా కోసం ఓ పెద్ద ప్రయోగమే చేశాడు. అరణ్య మూవీ కోసం భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయ్యింది. ‘ఏనుగులు మనకంటే చాలా తెలివైనవి.. వెరీ ఎమోషనల్.. సెంటిమెంటల్ అండ్ సో కేరింగ్’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

ఏనుగులు తరతరాలుగా నీళ్ల కోసం వెళ్లే దారిని మనుషులు తమ స్వార్థంతో గోడ కట్టడం.. ఆ తరువాత జరిగే పరిణామాలతో ట్రైలర్‌ను అద్భుతంగా చిత్ర యూనిట్ కట్ చేసింది. మనిషికి ప్రకృతికి మధ్య జరిగే ఈ భీకర పోరు.. అందులో ఈ ఏనుగుల రక్షణ కోసం జరిగే యుద్ధాన్ని అద్భుతంగా చూపించారు. ‘ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం’ అంటూ రానా చాలా సీరియస్‌గా చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకూ కనిపించని గెటప్‌లో రానా కనిపిస్తున్నాడు. ఏనుగులను రక్షించేందుకు రానా చేసే యత్నం ఆకట్టుకుంది.

ఈ సినిమా హిందీలో హాథీ మేరీ సాథీ, తమిళ్‌లో కాదన్, తెలుగులో ‘అరణ్య’ పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2021లో రాబోతున్న మొట్టమొదటి త్రిభాష చిత్రం ఇదే కావడం విశేషం. విష్ణు విశాల్, జోయ, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభు సాలమన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎరోస్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల మార్చి 26న ప్రపపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

More News

‘వ‌కీల్‌సాబ్‌’ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ఎంతో తెలుసా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’.

తాప్సీ స‌హా బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై ఐటీ దాడులు

బాలీవుడ్ సెల‌బ్రిటీస్ అయిన హీరోయిన్ తాప్సీ, ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌లు అనురాగ్ క‌శ్య‌ప్‌, వికాస్ భ‌ల్‌పై ఐటీశాఖ వారు దాడులు చేశారు.

గోవా బ్యూటీ ఇలియానా కొత్త ప్రియుడు..!

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న ‘విరాట‌ప‌ర్వం’ డిజిట‌ల్ హ‌క్కులు

నక్సలైట్.. రాజకీయ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తోన్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. రానా జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోన్న

ప‌వ‌న్ 27...మ‌రో డైరెక్ట‌ర్ కూడా జాయిన‌య్యాడు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’(వినిపిస్తోన్న టైటిల్).