అర‌వింద్ అంత డిమాండ్ చేస్తున్నాడా..

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ చిత్రంలో విల‌న్ పాత్ర‌ను అర‌వింద్ స్వామి పోషించారు. అయితే తెలుగు వెర్ష‌న్ లో కూడా విల‌న్ పాత్ర‌ను అర‌వింద్ స్వామి చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారు చిత్ర‌యూనిట్.

ఇటీవ‌ల అర‌వింద్ స్వామిని క‌ల‌సి తెలుగు వెర్ష‌న్ లో న‌టించ‌మ‌ని అడిగితే..3 కోట్లు రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసాడ‌ట అర‌వింద్ స్వామి. దీంతో షాక్ అయిన నిర్మాత ఆ పాత్ర‌ను అర‌వింద్ స్వామి కాకుండా వేరే ఎవ‌రు చేస్తే బాగుంటుంద‌నే విష‌య‌మై సీరియ‌స్ గా ఆలోచిస్తున్నార‌ట‌. ఆఖ‌రికి ఎవ‌రు సెట్ కాక‌పోతే అప్పుడు అర‌వింద్ స్వామినే ఫైన‌ల్ చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మ‌రి...చ‌ర‌ణ్ విల‌న్ గా అర‌వింద్ స్వామి ఫైన‌ల్ అవుతారో...? లేక వేరే న‌టుడుని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

More News

సూర్య 24 మూవీ రిలీజ్ వాయిదా..

హీరో సూర్య‌, మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతున్నక్రేజీ మూవీ 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు.

బాల‌య్య వెర్షెస్ నాగ్

నంద‌మూరి న‌ట సింహాం బాల‌క్రిష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు.

ఆ ముగ్గురు నిర్మాత‌లు క‌లిసారు

ఇటీవ‌ల అగ్ర‌హీరోల సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో చాలా గంద‌ర‌గోళ ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారితే..మొత్తం సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోతున్నాయి.

'తను నేను' 27న విడుద‌ల‌

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు.

చిరు మ‌న‌సు మార్చుకున్నాడా..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.