అరవింద్ అంత డిమాండ్ చేస్తున్నాడా..
- IndiaGlitz, [Tuesday,November 17 2015]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తని ఓరువన్ చిత్రంలో విలన్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. అయితే తెలుగు వెర్షన్ లో కూడా విలన్ పాత్రను అరవింద్ స్వామి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చిత్రయూనిట్.
ఇటీవల అరవింద్ స్వామిని కలసి తెలుగు వెర్షన్ లో నటించమని అడిగితే..3 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసాడట అరవింద్ స్వామి. దీంతో షాక్ అయిన నిర్మాత ఆ పాత్రను అరవింద్ స్వామి కాకుండా వేరే ఎవరు చేస్తే బాగుంటుందనే విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నారట. ఆఖరికి ఎవరు సెట్ కాకపోతే అప్పుడు అరవింద్ స్వామినే ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. మరి...చరణ్ విలన్ గా అరవింద్ స్వామి ఫైనల్ అవుతారో...? లేక వేరే నటుడుని సెలెక్ట్ చేస్తారో చూడాలి.