'RRR' లో వారిద్దరూ నటించలేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `RRR`. ఇందులో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ బ్యూటీ డైసీ ఎడ్గార్గ్ జోన్స్ను ఓకే చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దాంతో రాజమౌళి అండ్ టీం డైసీ స్థానంలో శ్రద్ధాకపూర్, పరిణీతి చోప్రాలను నటింప చేయాలని అనుకున్నారు. సంప్రదింపులు జరిపారు. అయితే శ్రద్ధాకపూర్ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా నటించేలేనని చెప్పేసిందట. అలాగే పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ బయోపిక్పై పోకస్గా ఉన్నానని కాబట్టి `RRR`లో నటించలేనని చెప్పేసిందట. దీంతో యూనిట్ `RRR`లో ఎన్టీఆర్ సరసన ఎవరిని తీసుకోవాలని మళ్లీ యోచనలో పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.