'అర్జున్ సుర‌వ‌రం' మ‌రోసారి వాయిదా

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా టి.ఎన్‌.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'అర్జున్ సుర‌వరం'. యంగ్ జ‌ర్న‌లిస్ట్ స‌మాజంలో జ‌రుగుతున్న ఓ పెద్ద స‌మ‌స్య‌పై ఎలా పోరాడ‌డ‌నే క‌థ‌తో రూపొందిన చిత్ర‌మిది.ఈ సినిమాను మే 1న విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకుని ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అయితే ఇప్పుడు సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ''ఒక సంవ‌త్స‌రం గ్యాప్‌, మంచి సినిమాతో ఒక మంచి పాయింట్‌తో నాతో పాటు చాలా మంది టెక్నీషియ‌న్స్ క‌ష్ట‌ప‌డి కార్మిక దినోత్స‌వం రోజు మీ అందరి అభిమానం కోసం రావ‌డానికి ఎదురు చూస్తున్న టైమ్‌లో అవెంజ‌ర్స్‌లాంటి ఎదురుదెబ్బ‌.

ఎలా ఐతే అవెంజ‌ర్స్ ధానోస్‌ని ఎదిరించి ప్ర‌పంచం కోసం పోరాడుతారో, అర్జున్ సుర‌వ‌రం కూడా స్టూడెంట్స్ కోసం పోరాడుతాడు. ఇలాంటి ఓ మంచి పాయింట్ ఉన్న సినిమాని చూసి న‌చ్చి కొనుకున్న డిస్ట్రిబ్యూట‌ర్స్ స‌ల‌హా మేర వాయిదా వేస్తున్నాం. ఇది నాకు బాధాకరం. అయిన‌ప్ప‌టికీ డ‌బ్బులు పెట్టి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తూ వారిచ్చే మ‌రో గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం మీలానే నేను వేచి చూస్తున్నాను. ఇలాంటి స‌మయంలో మీ తోడ్పాటు నాకు అత్య‌వ‌స‌రం. ఇన్ని రోజులు మిమ్మ‌ల్ని వెయిట్ చేయించినందుకు మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు తెలుపుతున్నాను'' అని తెలిపారు హీరో నిఖిల్‌.