'అర్జున' 13వ తేదీకి వాయిదా

  • IndiaGlitz, [Friday,March 06 2020]

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు.

నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ట్రైలర్స్ ఇటీవల విడుదలై...ట్రెండింగ్ లో ఉన్నాయని వారు చెప్పారు. ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు.

కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు.

More News

షూటింగ్ లో గాయపడ్డ అఖిల్

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.

ప‌వ‌న్ 27 లేటెస్ట్ అప్‌డేట్‌

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకెళుతున్నారు.

సూప‌ర్‌స్టార్‌కి విల‌న్‌గా మారుతున్న టాలీవుడ్ హీరో

సూప‌ర్‌స్టార్ ర‌జినీ కాంత్ తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’. డైరెక్ట‌ర్ శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా తెర‌కెక్కుతోంది.

ఎన్టీఆర్ 30పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో

రాజ్యసభకు చిరు.. క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు!

మెగాస్టార్ చిరంజీవికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపరాఫర్ ఇవ్వాలని భావిస్తు్న్నాడని..