'అర్జున' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,February 26 2020]

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి అందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా బుధవారం మధ్యాహ్నం ఈ చిత్రం ట్రైలర్ ను హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నట్టికుమార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ, మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయంలో రాజశేఖర్ అద్భుతమైన నటనను కనబరిచారు. సమకాలీన రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిది .యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలిచారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు.

More News

నాగ‌శౌర్య సినిమా ఆగిపోలేదు: నిర్మాత‌లు

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌, శ్రీనివాస్ అవ‌స‌రాల కాంబినేష‌న్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై ఓ సినిమా కొన్ని రోజుల ముందు స్టార్ట్ అయ్యింది.

క‌వ‌ల‌లుగా బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం మార్చి నుండి ప్రారంభం కానుంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రెండు ప్రేమ‌క‌థ‌లు..పున‌ర్జ‌న్మ‌ల‌తో నాని 27

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా `వి`ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు.

చంద్రబాబును జగన్ ఓడించారని ట్రంప్‌కు కోపం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..

పూరితో ప‌వ‌ర్‌స్టార్‌..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.