వైఎస్ షర్మిళ కేసులో అరెస్ట్‌ల పర్వం ప్రారంభం..

  • IndiaGlitz, [Sunday,February 03 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌‌రెడ్డి సోదరి షర్మిళ.. తనపై, తనకుటుంబంపై సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఇప్పటికే 12 వెబ్‌సైట్లను గుర్తించి నోటీసులు పంపిన పోలీసులు తాజాగా వెంకటేశ్ అనే యువకుడ్ని అరెస్ట్ చేశారు. ఇతని స్వగ్రామం ప్రకాశం జిల్లా చోడవరం అని పోలీసులు గుర్తించారు. వెంకటేశ్ అనే యువకుడు గుంటూరులో ఉంటూ ఎంసీఏ చేస్తున్నాడు. సోషల్ మీడియా గురించి పట్టున్న ఇతడు టాలీవుడ్ హీరో ప్రభాస్.. వైఎస్ షర్మిళ మధ్య సంబంధం ఉందంటూ ఫొటోలు, వీడియోలు చేసి యూట్యూబ్‌‌, ఫేస్‌‌బుక్‌లో పోస్ట్ చేస్తూ ప్రచారం చేశాడని ఖాకీలు గుర్తించారు. కాగా ప్రస్తుతం ఇతనిపై సెక్షన్ 507, ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ఇలా..!

కాగా ఈ వెంకటేశ్ అనే యువకుడ్ని ఓ ప్రత్యేక బృందం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు నీ వెనుక ఎవరున్నారు..? ఏ పార్టీ వాళ్లు ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారు..? ఈ వ్యవహారం మొత్తానికి కర్త, కర్మ, క్రియ ఎవరు..? నీతో పాటు ఉన్న టీమ్‌ ఎవరు..? ఎక్కడెక్కడ్నుంచి సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తున్నారు..? వైసీపీని దెబ్బతీయడానికి ఇలా దుష్రచారం చేయాలని మీకు సలహాలు ఇచ్చిందెవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. ఒక్కడు దొరికాడు గనుక మిగతా టీమ్‌ మొత్తాన్ని పట్టుకోవడానికి పెద్దగా సమయం ఏమీ పట్టదని పోలీసు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న వెబ్‌‌సైట్ల యాజమాన్యం నుంచి ఎలాంటి వివరణ వచ్చింది..? ఏమని వివరణ ఇచ్చారు..? అనే విషయం తెలియాల్సి ఉంది.

More News

ఫైన‌ల్ షెడ్యూల్‌లో 'మ‌హ‌ర్షి'

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'మ‌హ‌ర్షి'. మ‌హేష్ న‌టిస్తోన్న 25వ సినిమా ఇది.

అన‌సూయ క్లారిటీ..

టీవీ రంగం నుండి సినిమాల వైపు అడుగులేస్తున్న అన‌సూయ ఇప్పుడు మంచి సినిమాల‌ను ఒప్పుకుంటుంది. మంచి పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది.

బాడీ షేమింగ్ మంచిది కాదంటున్న హీరోయిన్‌

రీసెంట్‌గా త‌ల్లి అయిన నేహా ధూపియా లావుగా ఉందంటూ... కాస్త స‌న్నబ‌డితే బావుంటుంది అంటూ బాలీవుడ్‌లో ఓ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. అయితే ఈవార్త‌ల‌పై నేహా గ‌ట్టిగానే స‌మాధానం చెప్పింది.

ఇంట్లో చెప్ప‌నంటున్న ర‌కుల్‌

సినిమాలంటే ప్యాష‌న్‌లో పాటు పిట్‌నెస్ అంటే కేర్ ఉండే హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. రీసెంట్‌గా ఈమె త‌న ఫ్యాన్ చేసిన కామెంట్స్‌కు ఘాటైన బ‌దులిచ్చి వార్త‌ల్లో నిలిచింది.

జనసేన అభ్యర్థులను పరిశీలించేది ఈ ఐదుగురే..

2019 ఎన్నికల్లో 'జనసేన' సత్తా ఏంటో చూపాలని ముందుకెళ్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేశారు. తాజాగా ఐదుగురు సభ్యులతో జనసేన స్క్రీనింగ్ కమిటీని ప్రకటించారు.