close
Choose your channels

డైరెక్టర్ చేతులు పట్టుకుని అడిగాడు.. పవన్ కి ముందే తెలుసు

Tuesday, May 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డైరెక్టర్ చేతులు పట్టుకుని అడిగాడు.. పవన్ కి ముందే తెలుసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పూలబాటేమీ కాదు. మెగాస్టార్ సోదరుడిగా సులువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ దొరికింది. వరుస విజయాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత పదేళ్ల పాటు హిట్ లేదు. పవన్ స్నేహితుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.

బంగారం సినిమా విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆనంద్ సాయి మాట్లాడుతూ.. సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది పవన్ కి ముందే తెలుస్తుంది. కానీ ఏమైనా సరే ముందుకు వెళ్లడమే అనే తరహాలో పవన్ పంథా ఉంటుంది.

Also Read: నెటిజన్లపై రేణు దేశాయ్ ఫైర్

బంగారం కథ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ చిత్ర దర్శకుడు ధరణి అప్పటికి వరుస విజయాల్లో ఉన్నారు. పవన్ కి బంగారం కథ వినిపించారు. నిర్మాత ఏఎం రత్నం కూడా ఓకే చేశారు. కానీ కథలో సెకండ్ హాఫ్ పవన్ కి నచ్చలేదు. ఇది వర్కౌట్ కాదు అని నిర్మాతకు చెప్పేశాడు. కానీ దర్శకుడు ధరణి.. పవన్ చేతులు పట్టుకుని అడిగారు. తనపై నమ్మకం ఉంచాలని కోరారు. దీనితో పవన్ కాదనలేక బంగారం సినిమాకి ఓకే చెప్పారు అని ఆనంద్ సాయి తెలిపారు.

ఆ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన బంగారం బోల్తా కొట్టింది. పవన్ మరికొన్ని చిత్రాల విషయంలో కూడా ఇదే తరహా సంఘటనలు జరిగాయని ఆనంద్ సాయి అన్నారు.

వరుస పరాజయాల తర్వాత పవన్ గబ్బర్ సింగ్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. పవన్ చివరగా నటించిన వకీల్ సాబ్ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కోషియం రీమేక్ చిత్రాలలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల కరోనా బారీన పడ్డ పవన్ కోలుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.