గోదావరి వాసుల గుండెల్లో ఉన్నావ్ కాటన్ దొర!

  • IndiaGlitz, [Wednesday,May 15 2019]

అన్నం పెట్టే రైతన్నకు సాగునీరు అందక అల్లాడుతున్న కాలంలో ధాన్యం పండించేందుకు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ఆనకట్టకు రూపకల్పన చేసిన మహనీయుడు సర్‌ ఆర్ధర్‌ కాటన దొర. ఈ విషయాన్ని గోదావరి ప్రజలు ఇప్పటికీ.. ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు.. ఆ భగీరథుడు, మహనీయుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్ దొర జయంతి నేడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కృషి గుర్తుచేసుకుందాం. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందించటంలో ఆయన చేసిన కృషికి డెల్టా ప్రాంతం అన్నపూర్ణగా వర్ధిల్లుతోందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సొంతదేశంలో దక్కని గుర్తింపు ఆంధ్రాలో..!

కాటన్ దొర.. ఇంగ్లాండ్‌లో పుట్టినా ఆంధ్రాలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. సొంతదేశం.. రక్త సంబంధీకుల వద్ద కూడా లభించని గుర్తింపు, మర్యాద ఆంధ్రప్రదేశ్‌లో దక్కింది.. కోనసీమ వాసులు ముద్దుగా ‘అపర భగీరధుడు’ అని పిలుచుకుంటూ మురిసిపోతారు. 1847లో ధవళేశ్వరం వద్ద సాగు నీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. 1852 లో నీటి విడుదలను చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నేడు.. దాదాపు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంతోందంటే కేవలం కాటన్ చలవే.. అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న సమయంలో కాటన్ కొడుకు మరణించారు.. అయినా ప్రాజెక్ట్ పూర్తి అయితే రైతుల కళ్ళలో కనిపించే ఆనందం కోసం ఎంతో అంకితంగా పనిచేసిన మహానుభావుడు దొర. అయితే ఇప్పటికీ ధవళేశ్వరం ఆనకట్టలో ఒక్క చిన్న పగులుకాని.. చిన్న ఇసుకసున్నం ఉడిపోలేదు.. అంటే ఆ కట్టడం ఎలాందో ఉహించవచ్చు..!!. ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి జిల్లా వసూలు మేము కాటన్ వేసిన భిక్షతో బ్రతుకుతున్నాం అని అనడంలో అతిశయోక్తి లేదేమో..! 1982 నాటికి గోదావరి జిలాల్లో కాటన్ విగ్రహాలు 3000 ఉన్నాయి.. ఈ విగ్రహాలన్నీ గోదావరి జిల్లా వసూలు ఆయన మీద ప్రేమతో భక్తితో నిర్మించుకున్నవే.

కాటన్ దొరగారికి తర్పణాలు కూడా..!

అంతేకాదు.. బ్రాహ్మణులు రోజూ అర్ఘ్యం వదిలేటప్పుడే కాదు.. గోదావరికి పుష్కరాలొచ్చినప్పుడు కొంతమందైతే కాటన్ దొరగారికి తర్పణాలు కూడా వొదుల్తారు.. అదీ.. ఆయనగారంటే మావాళ్ళకున్న అభిమానం. పితృదేవతలకు సద్గతులు కల్పించడానికి గంగమ్మ తల్లిని భూమ్మీదకి రప్పించిన భగీరధుడుతో పోల్చడం కంటే.. తన జటాజూటాల్లో బంధించి పవిత్ర గంగాజలాలు ఎటు పడితే అటు ప్రవహించకుండా సరైన తీరులో కిందకి వొదిలిపెట్టి భూమాతకి, గంగామాతకి కూడా ఉపశమనం కలిగించిన పరమశివుడితో పోల్చడం కరెక్టని కొందరు అభిప్రాయపడుతున్నారు.

More News

86 వసంతాల తెలుగు సినిమా పుస్తకం 200 ప్రతులు మా నటీనటుల సంఘంకు బహూకరణ 

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు కృషితో, ఫాస్‌ ముద్రించిన మరియు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన '' 86 వసంతాల తెలుగు సినిమా ''

హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ వన్‌ ప్లస్ స్టోర్ నిర్మాణం

హైదరాబాద్‌లో అతిపెద్ద స్టోర్ ప్రారంభించడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ, ఐటీ హబ్‌గా హైదరాబాద్ మారుతుండటం ఎంతో ప్రత్యేకమని వన్ ప్లస్ సంస్థ

చిక్కిపోతున్న ‘చంద్రుడు’.. పెను ప్రమాదం తప్పదా!?

చందమామ రోజురోజుకు చిక్కిపోతున్నాడు. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. మున్ముంథు పెను ప్రమాదం తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవ్వరినీ వదలం!

టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన డ్రగ్స్ కేసులో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ల, ఆర్టిస్టులందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మంగళవారం రోజు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

'ఇస్మార్ట్ శంకర్'.. పక్కా ఊర మాస్..! (టీజర్ రివ్యూ)

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు నేడు. నేటితో రామ్.. 31వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.