బాలుపై వచ్చిన ఆ ఆర్టికల్ తెగ వైరల్ అవుతోంది..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సినీ కెరీర్.. 1966లో పద్మనాభం నిర్మించిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో బాలు పాడిన పాటకు విశేషమైన స్పందన వచ్చింది. ఆ పాట పాడిన యువకుడు ఎవరా? అంటూ విపరీతంగా చర్చ జరిగింది. అయితే నాడు ఓ వార్త పత్రిక ఆ పాట పాడిన యువకుడు అంటే మన గాన గంధర్వుడి గురించి ఏకంగా మూడు కాలమ్‌ల వార్త కథనాన్ని ప్రచురించింది. నాడు పత్రికల్లో ప్రచురితమైన ఓ కథనం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.

నాటకు పాటకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మర్యాద రామన్న’ చిత్రంలో పాట పాడినప్పుడు బాలు వయసు 22 ఏళ్లని సదరు పత్రిక పేర్కొంది. చదువుకుంటున్నాడని.. ఆయనను చూసినవారెవ్వరూ ఆ అబ్బాయే పాట పాడాటంటే ఎవరూ నమ్మరని సదరు పత్రి వెల్లడించింది. ‘ఎందుకంటే ఇంత ఘనమైన కూత కూసిన పిట్ట, ఇంత కొంచెం ఉండటం ఏమిటని అనుకుంటారు’ అని పత్రికలో పేర్కొన్నారు. 1963లో జరిగిన ఓ పాటలో పోటీలో బాలుకు ప్రథమ బహుమతి లభించిందని పత్రిక పేర్కొంది.

బాలు పాడిన పాటను ప్రేక్షకుల్లో కూర్చొని విన్న సంగీత దర్శకుడు కోదండపాణికి బాలు గొంతుక బాగా నచ్చిందట. వెంటనే బాలుని పిలిచి.. ‘‘నీ పాట పాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. నీ చేత నేను చిత్రాల్లో పాడిస్తాను. అయితే నీ గొంతు మరీ లేతగా ఉంది’’ అని చెప్పి అభినందించారని పత్రికలో పేర్కొన్నారు. ఇంకా బాలు గురించి పలు ఆసక్తికర విషయాలను సదరు పత్రిక వెల్లడించింది.

More News

రేపు సాయంత్రం తామరైపాకంలో బాలు అంత్యక్రియలు..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు.

బాలు, నేనూ శ్రీకాళహస్తిలో చదివాం.. రూ.100 తీసుకున్నా: మోహన్‌బాబు

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేడు పరమపదించిన విషయం తెలిసిందే.

చావంటే తెలియకుండా కన్నుమూయాలి: ఎస్పీబీ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో దాదాపు 40వేల పాటలు పాడారు.

ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌ అని తేలినప్పటి నుంచి మినిట్ టు మినిట్

గాన గంధర్వుడు గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు.

నిన్న సాయంత్రం నుంచే ఎంజీఎం వద్ద మారిపోయిన పరిస్థితులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.