close
Choose your channels

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా అరుణ్ మిశ్రా..!

Tuesday, June 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా అరుణ్ మిశ్రా..!

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్ కమిటీ ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకూ వెలువడలేదు. ఎన్‌హెచ్ఆర్‌సీ నూతన చైర్మన్ ఎంపిక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు.

ఈ కమిటీ జస్టిస్ అరుణ్ మిశ్రా పేరును సిఫార్స్ చేసింది. అయితే ‘ది హిందూ’ నివేదిక ప్రకారం ఖర్గే మాత్రం దీనిని విభేదించారు. కాగా.. దళిత, ఆదివాసి, మైనరిటీ కమ్యూనిటీల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నందున ఆ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయాలని ఖర్గే సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. జస్టిస్ అరుణ్ మిశ్రా 1978లో న్యాయవాదిగా తన వృత్తిని ఆరంభించారు. 1998-99లో అతి పిన్న వయసులోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎన్నికయ్యారు. అక్టోబర్ 1999లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా అరుణ్ మిశ్రా నియమితులయ్యారు. తరువాత ఆయన జూలై 7, 2014 న సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ముందు రాజస్థాన్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

సుప్రీంకోర్టులో అరుణ్ మిశ్రా పదవీకాలంలో ప్రముఖంగా జడ్జి లోయా కేసు, ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారం కేసులు ఆయనను వివాదంలోకి నెట్టివేశాయి. న్యాయమూర్తి బి.హెచ్. లోయా మరణంపై దర్యాప్తు కోరుతూ కేసును విచారించాలని ఆయన మొదట నిర్ణయించారు. ఈ కేసును జస్టిస్ మిశ్రాకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్-మోస్ట్ జడ్జిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన చివరికి ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. కాగా... మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్‌పర్సన్ ఎంపిక జరగలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్‌హెచ్ఆర్‌సీ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా, జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2020 సెప్టెంబర్ 2న పదవీ విరమణ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.