అను ఇమ్మాన్యుయేల్‌కు అంకుల్‌గా..

  • IndiaGlitz, [Saturday,March 10 2018]

1998లో విడుద‌లైన‌ 'గ్రీకువీరుడు' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు త‌న‌యుడు దాసరి అరుణ్ కుమార్. దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేక‌పోయింది. అంతేగాకుండా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అరుణ్‌కు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.

2008లో విడుద‌లైన‌ 'ఆదివిష్ణు' త‌రువాత‌ సినిమాలకు దూరమయ్యారు అరుణ్ కుమార్‌. ఇటీవల 'ఒక్కక్షణం'తో మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌.. ప్రస్తుతం నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు'(ప్ర‌చారంలో ఉన్న టైటిల్‌)లో నటిస్తున్నారు.

దాసరి మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ అనుకి అంకుల్ పాత్రలో అరుణ్ కుమార్ కనిపిస్తున్నారని తెలిసింది. అంతేగాకుండా.. అరుణ్ కోసం ప్రత్యేకంగా ఈ పాత్రని డిజైన్ చేశారని స‌మాచారం. ఈ పాత్ర తర్వాత వరుస ఆఫర్లతో అరుణ్ కుమార్ బిజీ నటుడిగా మారడం ఖాయమని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శైల‌జా రెడ్డిగా రమ్యకృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

ఎన్టీఆర్ ఏడోసారి ఆ ప‌ని చేయ‌నున్నారా?

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

నాగ్‌, నాని కెమిస్ట్రీనే ఓ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

మార్చి17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'మనసైనోడు'

మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా హెచ్. పిక్చర్స్ పతాకం పై హస్సేబుద్దిన్ నిర్మాతగా, సత్యవరపు వెంకటేశ్వరరావుని  దర్శకుడిగా పరిచయం చేస్తు నిర్మించిన చిత్రం 'మనసైనోడు'. ఇటీవల ఈ చిత్రo సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని  ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు.

​జూన్ 15న 'స‌మ్మోహ‌నం'

అనూహ్య‌మైన క‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న కొత్త త‌రం ప్రేమ క‌థా చిత్రం 'స‌మ్మోహ‌నం' జూన్ 15న విడుద‌ల కానుంది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

యాక్ష‌న్‌లోకి దిగిన మాస్ మ‌హారాజా

మాస్ మ‌హారాజా రవితేజ సినిమా అంటేనే కావలసినంత వినోదం. మంచి కామెడీ టైమింగ్‌తో పాటు తన మార్క్‌ యాస డైలాగులతో తెరపై సందడి చేస్తారాయ‌న‌. ఇక ఈ మాస్ మహారాజా సినిమాలో ఫైట్లు కూడా తన డైలాగుల్లాగే మాస్ గానే ఉంటాయి.