గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశా వర్కర్ మృతి

  • IndiaGlitz, [Sunday,January 24 2021]

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఆశావర్కర్ ఆదివారం మృతి చెందారు. గుంటూరుకు చెందిన విజయలక్ష్మి అనే ఆశా వర్కర్ ఈ నెల 19న కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ నెల 21న ఆమెకు తొలుత కళ్లు తిరిగాయి. అనంతరం విజయలక్ష్మి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జీజీహెచ్‌కు తరలించి వైద్యులు చికిత్సను అందించారు. కాగా.. శనివారం విజయలక్ష్మిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యాస్మిన్ పరామర్శించారు. ఈ రోజు విజయలక్ష్మి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. విజయలక్ష్మి తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్‌గా పని చేస్తున్నారు.

కాగా.. విజయలక్ష్మి మృతితో భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఒకరు, కర్ణాటకకు చెందిన మరొకరు మృతి చెందిన విషయం తెలిసిందే. గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఈ విషాదం వెలుగు చూసింది. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఛాతీనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే మహిపాల్ సింగ్ మృతి చెందాడు.

More News

పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..

జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన సవాళ్లు ప్రతిసవాళ్లకు వేదికగా మారుతోంది.

ప్రదీప్ మాట్లాడుతుండగా.. స్టేజిపైనే కుప్పకూలిన డైరెక్టర్

ఆనందంగా సాగిపోతున్న ప్రెస్‌మీట్‌లో ఊహించని ఘటన షాక్‌కు గురి చేసింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారి చేస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’.

ఆ దృశ్యాలు నా గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి: పవన్

దివీస్ నిరసనకారుల విడుదల సంతోషాన్నిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అక్కడి బాధితుల ఆవేదన, ఆక్రందనలను స్వయంగా చూశానన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి: పవన్

గ్రామ స్వరాజ్యంతోనే పల్లెలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని మహాత్మా గాంధీ ఎంతో దూరదృష్టితో చెప్పిన మాటలు అనేక సందర్భాలలో

'రాధేశ్యామ్‌' విడుదల మరింత ఆలస్యం.. ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తాజా చిత్రం 'రాధేశ్యామ్‌' విషయంలో అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.