చిరుకేం తెలుసు..? పవన్ నటిస్తే కోట్లే..  అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించి.. మూడు రాజధానులుంటాయేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన చేసిన నాటి నుంచి రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో కమిటీలు వేయడం.. ఆ కమిటీలు నివేదికలు ఇవ్వడం జరిగిపోయాయ్.. కాగా మరో రెండు మూడ్రోజుల్లో మూడు రాజధానులపై అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా మూడు రాజధానులను సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద దిక్కు, మెగాస్టార్ చిరంజీవి స్వాగతించి మద్దతిచ్చారు. అయితే.. ఈ వ్యవహారంపై ఇంతవరకూ మరే టాలీవుడ్ నటీనటులు స్పందించలేదు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ గురించి ప్రస్తావిస్తూ.. పరోక్షంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పేరును ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నా మిత్రుడి హయాంలో..!
‘రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోంది. గ్రామాల్లో ఉన్నది పోలీసులు కాదు..పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న గూండాలు. ఒక్కో ఇంటికి 10మంది పోలీసులు.. భూములిచ్చిన రైతులకు బహుమానమా?. మహిళలపై లాఠీచార్జ్‌ చేశారు.. ఏ సమాజంలో ఉన్నామో అర్ధం కావడం లేదు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ నా మిత్రుడు.. ఆయన హయాంలో ఇలా జరగడం దురదృష్టకరం’ అని అశ్వనీదత్ వ్యాఖ్యానించారు.

చిరు విజ్ఞతకు వదిలేస్తున్నా..!
‘చిరంజీవి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారు..?. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం ఆయనకు తెలియదా?. పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారు.. సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరుకు తెలియదా?’ అని చిరుపై అశ్వనీదత్ ప్రశ్నల వర్షం కురిపించారు.

More News

పార్టీ ముఖ్య సమావేశంలో పవన్.. ఎడ్ల పందాల్లో రాపాక

అవును.. జనసేన పార్టీకి సంబంధించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బిజిబిజీగా ఉంటే..

ఫిబ్రవరి 21 న 'రాహు' రిలీజ్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మనసులను కదిలిస్తున్న పూజా హెగ్డే మాటలు

ఆస్ట్రేలియా అడవుల్లోని కార్చిచ్చు.. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.

ప్రభాస్‌తో త్రివిక్రమ్.. చర్చలు షురూ!

టాప్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

చిరు ఫోన్ కోసం వెయిటింగ్.. నాన్నకు చెప్పా!!

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో