మహేష్ కోసం అసెంబ్లీ సెట్...

  • IndiaGlitz, [Tuesday,June 06 2017]

స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'తో బిజీగా ఉన్న మ‌హేష్ త‌ర్వాత‌గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్ చేసిన పేరు) సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అల్రెడి చిన్న పాటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మ‌హేష్ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటాడు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివార్ల‌లో ఓ భారీ అసెంబ్లీ సెట్‌ను వేయ‌బోతున్నార‌ట‌.

ఈ సినిమాలో మ‌హేష్ ఓ పొలిటీషియ‌న్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. శ్రీమంతుడు సినిమా త‌ర్వాత మ‌హేష్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయ‌బోతున్నారు.